Site icon NTV Telugu

Vijayawada: విజయవాడ టెర్రర్ లింక్‌ కేసులో సంచలన విషయాలు.. భారత్‌లో ఐసీస్ జెండా పాతాలని టార్గెట్

Kashmiri Terrorist

Kashmiri Terrorist

Vijayawada Terror Links Case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసులో కొత్త కోణం బయటపడింది. నిందితులు అందరి కామన్ పాయింట్‌గా ఉన్న అంశాన్ని పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ గేమ్ ద్వారా ఒకరికొకరు పరిచయమైనట్లు తెలిపారు. Free fire అనే ఆన్లైన్ వీడియో గేమ్ ద్వారా యువత వివరాలు విదేశీ హ్యాండ్లర్లు సేకరించారు. ఈ గేమ్ లో తదుపరి లెవెల్‌కు వెళ్ళేందుకు చెల్లించాల్సిన ఫీజ్‌ను తామే చెల్లిస్తామని విదేశీ హ్యాండ్లర్లు ముందుకు వచ్చారు. ఫ్రీ ఫైర్ గేమ్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కు కమ్యూనికేషన్ మళ్లింది. వీరిలో జిహాద్ భావజాలాన్ని నింపి ఆత్మహుతి దాడికి తెగబడేలా ప్రేరేపించినట్లు గుర్తించారు.

READ MORE: Varanasi :దేవర సెట్స్‌లో మహేష్ బాబు.. రాజమౌళి భారీ ప్లాన్ మామూలుగా లేదుగా!

అంతేకాదు.. విజయవాడ టెర్రర్ లింకుల కేసులో మరికొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చాయి. నిందితుల కస్టడీలో పలు కీలక విషయాలు రాబట్టారు. భారత్‌లో జాతీయ జెండాకు బదులు ఐసీస్ జెండా పెట్టడం తమ టార్గెట్ అన్నారు నిందితులు. A nation led by Mohamed wil not surrender అని పెట్టి యువతను ఐసీస్ వైపు ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు తేటతెల్లమైంది. కర్త కర్మ క్రియా అంతా ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన షుకూర్ అనే ఉగ్రవాదిగా గుర్తించారు. జిహాద్ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవారిని గుర్తించే పనిని వీరికి అప్పగించాడు. ఇప్పటి వరకు షుకూర్‌ను కలవలేదని నిందితులు చెబుతున్నారు. త్వరలో దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్‌ను కల్పిస్తానని నిందితులకు షుకూర్ చెప్పడట. ఇప్పటి వరకు మొత్తం 11 రాష్ట్రాల్లో 42 మందికి లింక్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. Benx.com ద్వారా కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కమ్యూనికేట్ అయ్యేట్టు షుకూర్ కుట్ర పన్నాడు.

Exit mobile version