మనం దేశంలో స్త్రీని లక్ష్మీ దేవి అని సంభోసంబోదిస్తారు.. స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం… ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళలోంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. స్త్రీలు చేసే పనులు కూడా కుటుంబంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనడం జరిగింది. వీటి ద్వారా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పేదరికం పోయిన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.. అసలు స్త్రీ ఏం చేయ్యకూడదో, చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో విబేధాలు కూడా తొలగిపోతాయి. పడకగదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్యబంధంలో ప్రేమలు కురుస్తాయి…గొడవలు రానే రావు..
నిద్రపోయే ముందు పూజ గదిలో అగరబత్తిని వెలిగించాలి.నిద్రపోయే ముందు చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం 5 నిమిషాలు మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి..
అలాగే నిద్రపోయే ముందు ముఖద్వారం వద్ద ఆవనూనె దీపం వెలిగించాలి. ఈ పరిహారం చేయడం ద్వారా, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది..
రాత్రి పడుకునే ముందు ఇంటి ముఖద్వారం వద్ద ఆవనూనె దీపం వెలిగించాలి. ఈ పరిహారం చేయడం ద్వారా, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. లక్ష్మీదేవి కూడా సంతోషంగా ఉంటుంది..
ఇకపోతే చివరగా నిద్రపోయే ముందు ఇంట్లోని లైట్లు అన్నీ ఆఫ్ చేస్తారు. అయితే ఇంట్లో నైరుతి మూల చీకటిగా ఉండకూడదు. అందుకే పడుకునే ముందు ఇక్కడ దీపం వెలిగించాలి. దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే, ఈ దిశలో చిన్న బల్బును అమర్చండి.. అంతా మంచే జరుగుతుంది.. ఆర్థిక సమస్యలు పోతాయి.. ఇలాంటి పనులు చెయ్యడం వల్ల సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయి…
