టాలీవుడ్ దిగ్గజ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’ (Varanasi) అప్పుడే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. సుమారు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ‘ఎనౌన్స్ మెంట్ టీజర్’ గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ టీజర్ను పారిస్లోని ప్రతిష్టాత్మకమైన ‘లే గ్రాండ్ రెక్స్’ (Le Grand Rex) థియేటర్లో ప్రదర్శించబోతున్నారు. ఇలా పారిస్లో గ్రాండ్గా టీజర్ లాంచ్ జరుపుకుంటున్న తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ చరిత్ర సృష్టించబోతోంది. కాగా,
ఈ చారిత్రాత్మక ప్రదర్శన జనవరి 5, 2026న (ఈరోజు) రాత్రి 9 గంటలకు జరగనున్నట్లు ఫ్రెంచ్ పంపిణీ సంస్థ ‘ఆన్నా ఫిల్మ్స్’ అధికారికంగా ప్రకటించింది. పెద్ద తెరపై అత్యున్నత సాంకేతికతతో ఈ టీజర్ను అభిమానుల ముందుకు తీసుకురానున్నారట. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను, దేవా కట్టా మాటలను సమకూరుస్తున్నారు. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్న రాజమౌళి, ఈ టీజర్తోనే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో శాంపిల్ చూపించబోతున్నారు.
