టాలీవుడ్లో ‘బేబి’ సినిమాతో రాత్రికి రాత్రే సెన్సేషన్గా మారిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య, ఇప్పుడు కోలీవుడ్లోనూ జెండా పాతేందుకు సిద్ధమైంది. కొన్నేళ్ల క్రితం అజిత్ కుమార్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘వలిమై’లో వైష్ణవి ఒక చిన్న పాత్రలో మెరిసింది. అప్పట్లో ఆమె ఒక స్టార్ హీరో పక్కన కనిపించడమే పెద్ద విశేషంగా భావించారు. కానీ, తన అంచలంచెలుగా ఎదుగుతూ, ఇప్పుడు అదే తమిళ పరిశ్రమలో ఏకంగా మెయిన్ లీడ్ అవకాశాన్ని దక్కించుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్లో వైష్ణవిని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు అధికారిక సమాచారం.
Also Read :Malaika Arora : 19 ఏళ్ళ చిన్నోడితో మలైకా డేటింగ్.. అతని హిస్టరీ ఇదే!
వైష్ణవి ఎదుగుదల చూస్తుంటే, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమనిపిస్తుంది. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి మొదలైన ఆమె ప్రయాణంలో తొలత పెద్ద సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ తన ఉనికిని చాటుకుంది. ‘బేబి’ చిత్రంతో తన నటనలోని విశ్వరూపాన్ని చూపి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు కోలీవుడ్లో ఒక ప్రామిసింగ్ హీరో సరసన అవకాశం అందుకోవడం ద్వారా తన మార్కెట్ను విస్తరించుకుంది. తమిళ ప్రేక్షకులు కూడా పర్ఫార్మెన్స్కు ప్రాధాన్యత ఇచ్చే నటీమణులను ఆదరించడంలో ముందుంటారు. వైష్ణవికి ఉన్న సహజమైన నటన, గ్లామర్ అక్కడ కూడా వర్కవుట్ అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ గనక హిట్ అయితే, కోలీవుడ్లో బిజీయెస్ట్ హీరోయిన్లలో వైష్ణవి ఒకరు కావడం ఖాయం.
