Hamas: మూల్యం చెల్లించుకుంటారు.. అమెరికాకు హమాస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా మరోసారి నివురుగప్పిన నిప్పులా మారింది. అమెరికా జరిగిస్తున్న బాంబుల దాడితో దద్దరిల్లుతోంది. దీంతో గత కొద్దిరోజులుగా రక్తపుటేరులు పారుతున్నాయి. ఇక జోర్డన్లో ఇటీవల మిలిటెంట్లు జరిపిన డ్రోన్ దాడుల కారణంగా ముగ్గురు అమెరికన్ సైనికులు మృత్యువాతకు గురయ్యారు. దీనికి ప్రతీకారంగా సిరియాలో మిలిటెంట్ల స్థావరాల లక్ష్యంగా అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ మద్దతిస్తున్న 40 మంది మిలిటెంట్లు మరణించినట్లు తెలుస్తోంది.
హమాస్ వార్నింగ్…
ఇరాక్, సిరియాలోని ఇరాన్ (Iran) మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్ రివల్యూషనరీ గార్డుల స్థావరాలపై అమెరికా (USA) దాడులు చేయడాన్ని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) తీవ్రంగా తప్పుబట్టింది. ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ చర్య అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉందని పరిగణించింది. ఆయా దేశాల్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు అమెరికా పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్కు సాయం చేస్తూ పాలస్తీనాలోని సామాన్యులను బలి తీసుకుంటోందని విమర్శించింది. ఇలాంటి చర్యలతో ఉద్రిక్తతలు మరింత ఎక్కువవుతాయే తప్ప.. తగ్గబోవని హెచ్చరించింది. ఇజ్రాయెల్ దురాక్రమణ, గాజాలోని ప్రజలపై మారణహోమానికి ముగింపు పలికినప్పుడే ఆయా ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
ఇటీవల అమెరికా సైనిక క్యాంప్పై డ్రోన్ దాడి జరగడంతో ముగ్గురు సైనికులు మృతి చెందారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అగ్రరాజ్యం.. ఇరాక్, సిరియాల్లోని 85 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ఇరాన్ మద్దతిస్తున్న 40 మంది మిలిటెంట్లు మరణించినట్లు యూకేలోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది. అలాగే ఇరాక్లో 16 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు బాగ్దాద్ తెలిపింది.
తాజావార్తలు
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..