Budget History: 92 ఏళ్ల బడ్జెట్ సంప్రదాయానికి బ్రేక్ వేసిన అరుణ్ జైట్లీ.. ఇంతకీ ఏంటా హిస్టరీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget History: ఫిబ్రవరి 1, 2026 ఈ తేదీకి కోసం దేశం ఎదురుచూస్తోంది. దేశంలోని ప్రముఖ పార్టీలు, అన్ని రాష్ట్రాలతో పాటు ఆర్థిక వర్గాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే.. ఆ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మంత్రి హోదాలో ఆమె వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. 2019 జూలై 5న నిర్మలా సీతారామన్ మొదటిసారి బడ్జెట్ చదివారు. అప్పటి నుంచి ఏటా ఆమె బడ్జెట్ ప్రవవేశపెడుతున్నారు. అయితే.. మోడీ ప్రభుత్వం 92 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్ వేసింది. ఇంతకీ ఆ సంప్రదాయం ఏంటి? 92 ఏళ్లుగా ఏం జరిగింది? అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..
READ MORE: Police Raids: రోజువారీ కూలీ ఇంట్లో పోలీసుల సోదాలు.. రూ. కోటిన్నర విలువైన బంగారం, వెండి చూసి షాక్..!
Also Read
- Hyderabad: మియాపూర్లో విషాదం..! ఓపెన్ మ్యాన్హోల్లో పడి వ్యక్తి గల్లంతు.!
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
వాస్తవానికి.. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో పాత పద్ధతులు మారిపోయాయి. చాలా కాలంగా కొనసాగిన రైల్వే బడ్జెట్ సంప్రదాయానికి ఎన్డీఏ ప్రభుత్వం స్వస్తి పలికింది.. ఒకప్పుడు బడ్జెట్ అంటే రెండు రోజుల కథ. మొదటి రోజు రైల్వే బడ్జెట్, రెండో రోజు సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టేవారు. ఇది దాదాపు 92 ఏళ్లుగా కొనసాగిన సంప్రదాయం. భారత బడ్జెట్ చరిత్రను చూస్తే, రైల్వే బడ్జెట్కు ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు దేశ అభివృద్ధిలో రైల్వే కీలక పాత్ర పోషించేది. అందుకే రైల్వేకు ప్రత్యేకంగా బడ్జెట్ ఉండేది. విద్య, ఆరోగ్యం, రక్షణ, వ్యవసాయం, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలు సాధారణ బడ్జెట్లో ఉంటే.. రైళ్లకు సంబంధించిన కొత్త లైన్లు, టికెట్ ధరలు, స్టేషన్లు, సదుపాయాలు అన్నీ రైల్వే బడ్జెట్లో ప్రకటించేవారు.
READ MORE: Nizamabad: గంజాయి ముఠా బరి తెగింపు.. మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి..
1924లో బ్రిటిష్ పాలన సమయంలో ఈ సంప్రదాయం మొదలైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా సాధారణ బడ్జెట్కు ఒక రోజు ముందే రైల్వే బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేవారు.స్వాతంత్ర్యం అనంతరం కూడా ఈ పద్ధతి అలాగే కొనసాగింది. రైల్వే బడ్జెట్ రోజు అంటే ప్రయాణికులు టికెట్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? కొత్త లైన్లు ఎక్కడ కేటాయించారు? అని ఉత్కంఠగా ఎదురు వాళ్లు. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాత సంప్రదాయంపై కొత్త ఆలోచన మొదలైంది. చివరకు 2017లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లోనే కలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా 92 ఏళ్ల చరిత్రకు తెరపడింది. ఆ ఏడాది నుంచి రైల్వే బడ్జెట్ అనే ప్రత్యేక కార్యక్రమం లేకుండా.. ఒకే రోజు ఒకే బడ్జెట్లో అన్ని అంశాలు ప్రకటించే విధానం మొదలైంది.
READ MORE: Suryakumar Yadav: విజయానికి కారణమైన ఇషాన్ కిషన్పై కెప్టెన్ ఫైర్.. ఎందుకో తెలుసా?
మొదటిసారి కామన్ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. 2017లో ఆయన సాధారణ బడ్జెట్ చదువుతూనే రైల్వేకు సంబంధించిన అంశాలన్నీ అదే ప్రసంగంలో చెప్పారు. రైల్వే బడ్జెట్ రోజు లేకపోవడం, ప్రత్యేకంగా రైళ్లపై ప్రకటనలు వినిపించకపోవడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది. ఈ నిర్ణయం ప్రభుత్వం ఒక్కరోజులో తీసుకున్నది కాదు. బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన ఈ సంప్రదాయాన్ని మార్చాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించింది. రైల్వే సైతం దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగమే కాబట్టి, దాన్ని వేరుగా చూడాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. అదే ఆలోచనను ప్రభుత్వం అమలు చేసింది.
తాజావార్తలు
-
Hyderabad: మియాపూర్లో విషాదం..! ఓపెన్ మ్యాన్హోల్లో పడి వ్యక్తి గల్లంతు.!
-
Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!