Budget History: 92 ఏళ్ల బడ్జెట్ సంప్రదాయానికి బ్రేక్ వేసిన అరుణ్ జైట్లీ.. ఇంతకీ ఏంటా హిస్టరీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget History: ఫిబ్రవరి 1, 2026 ఈ తేదీకి కోసం దేశం ఎదురుచూస్తోంది. దేశంలోని ప్రముఖ పార్టీలు, అన్ని రాష్ట్రాలతో పాటు ఆర్థిక వర్గాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే.. ఆ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మంత్రి హోదాలో ఆమె వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. 2019 జూలై 5న నిర్మలా సీతారామన్ మొదటిసారి బడ్జెట్ చదివారు. అప్పటి నుంచి ఏటా ఆమె బడ్జెట్ ప్రవవేశపెడుతున్నారు. అయితే.. మోడీ ప్రభుత్వం 92 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్ వేసింది. ఇంతకీ ఆ సంప్రదాయం ఏంటి? 92 ఏళ్లుగా ఏం జరిగింది? అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..
READ MORE: Police Raids: రోజువారీ కూలీ ఇంట్లో పోలీసుల సోదాలు.. రూ. కోటిన్నర విలువైన బంగారం, వెండి చూసి షాక్..!
Also Read
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
వాస్తవానికి.. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో పాత పద్ధతులు మారిపోయాయి. చాలా కాలంగా కొనసాగిన రైల్వే బడ్జెట్ సంప్రదాయానికి ఎన్డీఏ ప్రభుత్వం స్వస్తి పలికింది.. ఒకప్పుడు బడ్జెట్ అంటే రెండు రోజుల కథ. మొదటి రోజు రైల్వే బడ్జెట్, రెండో రోజు సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టేవారు. ఇది దాదాపు 92 ఏళ్లుగా కొనసాగిన సంప్రదాయం. భారత బడ్జెట్ చరిత్రను చూస్తే, రైల్వే బడ్జెట్కు ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు దేశ అభివృద్ధిలో రైల్వే కీలక పాత్ర పోషించేది. అందుకే రైల్వేకు ప్రత్యేకంగా బడ్జెట్ ఉండేది. విద్య, ఆరోగ్యం, రక్షణ, వ్యవసాయం, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలు సాధారణ బడ్జెట్లో ఉంటే.. రైళ్లకు సంబంధించిన కొత్త లైన్లు, టికెట్ ధరలు, స్టేషన్లు, సదుపాయాలు అన్నీ రైల్వే బడ్జెట్లో ప్రకటించేవారు.
READ MORE: Nizamabad: గంజాయి ముఠా బరి తెగింపు.. మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి..
1924లో బ్రిటిష్ పాలన సమయంలో ఈ సంప్రదాయం మొదలైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా సాధారణ బడ్జెట్కు ఒక రోజు ముందే రైల్వే బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేవారు.స్వాతంత్ర్యం అనంతరం కూడా ఈ పద్ధతి అలాగే కొనసాగింది. రైల్వే బడ్జెట్ రోజు అంటే ప్రయాణికులు టికెట్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? కొత్త లైన్లు ఎక్కడ కేటాయించారు? అని ఉత్కంఠగా ఎదురు వాళ్లు. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాత సంప్రదాయంపై కొత్త ఆలోచన మొదలైంది. చివరకు 2017లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లోనే కలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా 92 ఏళ్ల చరిత్రకు తెరపడింది. ఆ ఏడాది నుంచి రైల్వే బడ్జెట్ అనే ప్రత్యేక కార్యక్రమం లేకుండా.. ఒకే రోజు ఒకే బడ్జెట్లో అన్ని అంశాలు ప్రకటించే విధానం మొదలైంది.
READ MORE: Suryakumar Yadav: విజయానికి కారణమైన ఇషాన్ కిషన్పై కెప్టెన్ ఫైర్.. ఎందుకో తెలుసా?
మొదటిసారి కామన్ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. 2017లో ఆయన సాధారణ బడ్జెట్ చదువుతూనే రైల్వేకు సంబంధించిన అంశాలన్నీ అదే ప్రసంగంలో చెప్పారు. రైల్వే బడ్జెట్ రోజు లేకపోవడం, ప్రత్యేకంగా రైళ్లపై ప్రకటనలు వినిపించకపోవడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది. ఈ నిర్ణయం ప్రభుత్వం ఒక్కరోజులో తీసుకున్నది కాదు. బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన ఈ సంప్రదాయాన్ని మార్చాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించింది. రైల్వే సైతం దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగమే కాబట్టి, దాన్ని వేరుగా చూడాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. అదే ఆలోచనను ప్రభుత్వం అమలు చేసింది.
తాజావార్తలు
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?