Site icon NTV Telugu

Uttarakhand: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలోకి యూసీసీ బిల్లు

Ucc Bill

Ucc Bill

ఉమ్మడి పౌర స్మృతి( యూసీసీ ) బిల్లును ఇవాళ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రవేశ పెట్టబోతున్నారు. ఇటీవ‌ల ఆ బిల్లును రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. భార‌తీయ పౌరులు అంద‌రికీ ఒకే ర‌క‌మైన చ‌ట్టం ఉండేలా ఈ బిల్లును రూపొందించారు. అయితే, ఈ చ‌ట్టాల‌కు మ‌త‌ప‌ర‌మైన అధికారాలు ఉండ‌వు.. పెళ్లి, విడాకులు, వార‌స‌త్వం, దత్తత లాంటి వ్యక్తిగత విషయాల అంశల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు కీల‌కం కానుంది.

Read Also: IND vs ENG: అబుదాబికి వెళ్లనున్న ఇంగ్లండ్‌ జట్టు.. కారణం ఏంటంటే?

అయితే, ఈ బిల్లు ఒక‌వేళ ఉత్తరాఖండ్ అసెంబ్లీలో పాసైతే అప్పుడు దాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేయనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉమ్మడి పౌర స్మృతిని అమ‌లు చేసిన మొద‌టి రాష్ట్రంగా నిలువ‌నుంది. ఇక, ఇదే చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌డానికి బీజేపీ పాలిత రాష్ట్రాలైన అస్సాం, మధ్యప్రదేశ్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. పోర్చుగీసు పాల‌న‌లో ఉన్న గోవాలో కూడా ఇలాంటి సివిల్ కోడ్ రూల్ చాన్నాళ్లుగా అమ‌లులో ఉంది. బహుభార్యత్వాన్ని రద్దు చేసే ఉద్దేశంతో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లును అక్కడి ప్రభుత్వం ప్రవేశ పెడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక లివిన్ రిలేష‌న్‌లో ఉన్న జంట‌లు రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది.

Exit mobile version