UNFPA Report : 77 ఏళ్లలో భారత జనాభా రెట్టింపు.. నివేదికలో ఐక్యరాజ్యసమితి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UNFPA Report : భారతదేశంలో చివరి జనాభా గణన 2011లో జరిగింది. ఆ సమయంలో చైనా తర్వాత రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. అప్పుడు దేశ జనాభా 121 కోట్లు. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (UNFPA) భారతదేశ జనాభా నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ప్రస్తుతం భారతదేశ జనాభా 144 కోట్లకు చేరుకుంది. ఇందులో 24 శాతం జనాభా 0 నుంచి 14 ఏళ్ల లోపు వారే.
రాబోయే 77 ఏళ్లలో భారతదేశ జనాభా రెట్టింపు అవుతుందని కూడా ఈ నివేదికలో అంచనా వేశారు. జనాభాతో పాటు నవజాత శిశువుల మరణాలు, మహిళల స్థితి, LGBTQ మొదలైన వాటి గురించి కూడా నివేదిక అందిస్తుంది. భారతదేశంలో మాతాశిశు మరణాలు భారీగా తగ్గుముఖం పట్టాయని కూడా నివేదికలో చెప్పబడింది.
Also Read
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
Read Also:Venkatesh 75 : వెంకీ సినిమాలో నటించాలనుకునేవారికి బంఫర్ ఛాన్స్..
ఏ వయసులో ఎంత మంది?
భారతదేశంలోని 144.17 కోట్ల జనాభాలో, 24 శాతం మంది 0-14 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కాగా, 17 శాతం మంది 10-19 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. ఇది మాత్రమే కాదు, భారతదేశంలో 10-24 సంవత్సరాల వయస్సు గలవారు కూడా 26 శాతం ఉండగా, 15-64 సంవత్సరాల వయస్సు వారు అత్యధికంగా 68 శాతం మంది ఉన్నారు. ఇది కాకుండా, భారతదేశ జనాభాలో 7 శాతం మంది 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు, ఇందులో పురుషుల ఆయుర్దాయం 71 సంవత్సరాలు, స్త్రీల ఆయుర్దాయం 74 సంవత్సరాలు.
భారతదేశంలో మాతాశిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి మరణాలలో ఇది 8 శాతం. భారతదేశంలో ఈ విజయం సాధించిన ఘనత ప్రజలకు సరసమైన, మంచి ఆరోగ్య సేవలను అందించడానికి, లింగ వివక్షను తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి అందించబడింది. UNFPA భారతదేశంలోని 640 జిల్లాలలో మూడింట ఒక వంతు ప్రసూతి మరణాలను తగ్గించడానికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించినట్లు సర్వేలో వెల్లడైంది. నవజాత శిశు మరణాల రేటును తగ్గించడానికి, శిశువులు, తల్లులకు పౌష్టికాహారాన్ని అందించడానికి భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. ఇది కాకుండా, మంచి, చౌకైన ఆరోగ్య సంరక్షణ కూడా జనాభా పెరుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషించింది.
Read Also:Maruthi Ngar Subramanyam : అల్లు అర్జున్ మూవీ సీన్స్ తో రొమాంటిక్ సాంగ్..మేడమ్ సార్ మేడమ్ అంతే..
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?