Gaza : కలలో కూడా చూడని విధ్వంసం.. గాజా పునర్నిర్మాణానికి ఏళ్ల సమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza : ఐక్యరాజ్యసమితి (UN) గురువారం నాడు విడుదల చేసిన నివేదికలో యుద్ధంతో దెబ్బతిన్న గాజాకు సంబంధించి షాకింగ్ అప్డేట్ వెలువడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గాజాలో జరిగిన విధ్వంసాన్ని ప్రపంచం చూడలేదని ఐరాస గురువారం పేర్కొంది. ఇది మాత్రమే కాదు, ఈ రోజు యుద్ధం ముగిస్తే ఇజ్రాయెల్ బాంబు దాడులు, భూదాడులలో ధ్వంసమైన ఇళ్లను మరమ్మతు చేయడానికి కనీసం 2040 వరకు పడుతుంది.
అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్లో హమాస్ చేసిన ఆకస్మిక దాడి తర్వాత ప్రారంభమైన యుద్ధం సామాజిక, ఆర్థిక ప్రభావం వేగంగా పెరుగుతోందని UN అంచనా చెబుతోంది. ఏప్రిల్ మధ్య నాటికి 33,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. 80,000 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. దాదాపు 7,000 మంది ఇతర వ్యక్తులు తప్పిపోయారు. చాలా మంది శిథిలాల కింద ఖననం చేయబడి ఉంటారని భావిస్తున్నారు.
Also Read
Read Also:SRH vs RR: ఉప్పల్ మైదానంలో అనసూయ సందడి.. వైరల్గా మారిన హాట్ యాంకర్ రియాక్షన్!
యుద్ధం కొనసాగుతున్నందున గజన్లు, పాలస్తీనియన్లందరూ ప్రతిరోజూ భారీ నష్టాలను చవిచూస్తున్నారని యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అడ్మినిస్ట్రేటర్ అచిమ్ స్టెయినర్ తెలిపారు. యుఎన్డిపి, పశ్చిమాసియా కోసం ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ కమీషన్ నివేదిక గాజాలో మనుగడ కోసం పోరాటం భయంకరమైన చిత్రాన్ని చిత్రించింది. ఇక్కడ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 201,000 ఉద్యోగాలు పోయాయి. ఆర్థిక వ్యవస్థ 2023 చివరి త్రైమాసికంలో 81 శాతం క్షీణించింది.
అబ్దుల్లా అల్ దర్దారీ, అరబ్ దేశాలకు సంబంధించిన యూఎన్డీపీ రీజినల్ డైరెక్టర్ ఓ నివేదికలో గాజాలో సుమారు 50 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు ధ్వంసమయ్యాయని అంచనా వేశారు. 1.8 మిలియన్ పాలస్తీనియన్లు పేదరికంలోకి పడిపోయారు. 2007లో హమాస్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి గాజాను ఇజ్రాయెల్, ఈజిప్ట్ దిగ్బంధనం చేసింది. భూభాగం నుండి ప్రవేశం, నిష్క్రమణపై కఠినమైన నియంత్రణలను విధించింది. యుద్ధానికి ముందే, అది 45 శాతం అధిక నిరుద్యోగాన్ని ఎదుర్కొంది. యువ కార్మికులలో దాదాపు 63 శాతానికి చేరుకుంది. యూఎన్ మానవ అభివృద్ధి సూచిక, ఆరోగ్యకరమైన జీవితానికి, జ్ఞానాన్ని , మంచి జీవన ప్రమాణాన్ని సాధించడం కోసం కీలక అంశాలను కొలుస్తుంది. ఈ యుద్ధంతో గాజా 20ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది.
Read Also:Bengal Governor: గవర్నర్ లైంగికంగా వేధించాడంటూ రాజ్భవన్ ఉద్యోగి ఫిర్యాదు..
ఆర్థిక వ్యవస్థ మూలాధారం ధ్వంసమైంది.. రంగాలు 90 శాతానికి పైగా నష్టాలను చవిచూశాయి. 2024లో గాజా జిడిపి 51 శాతం క్షీణించవచ్చని అంచనా. నష్టం పరిధి, స్థాయి యుద్ధం కొనసాగుతున్నందున అది ఇంకా పెరుగుతోంది. గాజాలో కనీసం 370,000 గృహాలు దెబ్బతిన్నాయి. అందులో 79,000 పూర్తిగా ధ్వంసమయ్యాయని నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!