NTV Telugu Site icon

Miss Coastal 2024: మిస్ కోస్టల్ కిరీటాన్ని కైవసం చేసుకున్న సుస్మితా ఆచార్య

Costa;

Costa;

మిస్ కోస్టల్ 2024 కిరీటాన్ని సుస్మితా ఆచార్య  కైవసం చేసుకుంది. ఇటీవలే ఈ ఈవెంట్ ఉడిపిలో నిర్వహించారు. ప్రతిభావంతురాలైన సుస్మితా ఆచార్య భరతనాట్యం నృత్యకారిణి కూడా. గతంలో పలు పోటీల్లో పాల్గొని అవార్డులు గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

టీఎస్‌ఆర్ మోడలింగ్ మేనేజ్‌మెంట్ ఉడిపి ఎసెన్షియా మణిపాల్ ఇన్‌లో జరిగిన ‘‘టీన్-మిస్-మిసెస్ కోస్టల్ 2024’ ప్రారంభ ఎడిషన్‌ విజయవంతంగా ముగించింది. ఉడిపిలోని జయలక్ష్మి సిల్క్స్ మరియు అభరణ్ జ్యువెలర్స్ స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమంలో గ్లామర్ అబ్బురపరిచింది. మిస్ కోస్టల్ 2024 విభాగంలో సుస్మిత ఆచార్య టైటిల్‌ను కైవసం చేసుకుంది. సాయి శృతి, లిండా లూయిస్ 1వ మరియు 2వ రన్నరప్ స్థానాలను కైవసం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Chirala: ఈపూరుపాలెం యువతి హత్య కేసును 48 గంటల్లోపే ఛేదించిన పోలీసులు

ఈ కార్యక్రమంలో భారత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ సూర్యకాంత్ జె సువర్ణ, నటీమణులు, సినీ పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.