Kathua Encounter: కథువాలో ఎన్ కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి

  • కథువాలో ఎన్ కౌంటర్
  • ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
  • 5 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు
Encounter

Encounter

జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భద్రతా దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. కథువా ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా, 5 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ప్రత్యేక పోలీసు అధికారి భరత్ చలోత్రా కాల్పుల్లో గాయపడ్డారు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ ఎన్‌కౌంటర్ సమయంలో భారీ కాల్పులు, పేలుళ్లు సంభవించాయని అధికారులు తెలిపారు.

Also Read:Viral Video: డోంట్ జడ్జ్ బై ఇట్స్ కవర్.. యూట్యూబర్కు ఇచ్చిపడేసిన ఆటోవాలా!

×
×
Ad

కథువా జిల్లాలోని సుఫాన్ అనే ప్రశాంత గ్రామం కాల్పులు, గ్రెనేడ్లు, కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. రాజ్‌బాగ్‌లోని ఘాటి జుతానా ప్రాంతంలోని జఖోలే గ్రామ సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సైనికులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. వెంటనే ఆ ప్రాంతంలో అదనపు పోలీసు, సైన్యం, సిఆర్‌పిఎఫ్ బలగాలను మోహరించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) నాయకత్వంలో ఆర్మీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఈ ఆపరేషన్ నిర్వహించాయని అధికారులు తెలిపారు.