School Holidays: 2 రోజుల పాటు స్కూళ్లకు సెలవు.. వారికి మాత్రమే..
School Holidays: ఈ మధ్య వర్షాలు వచ్చినప్పుడు.. పండుగలు ఇలా విద్యా సంస్థలకు భాగానే సెలవులు వచ్చాయి.. మరో సారి తెలంగాణలో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు వచ్చాయి.. రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు డిసైడ్ చేసింది ప్రభుత్వం.. ఇంతకీ విషయం ఏంటంటే.. తెలంగాణ వరుసగా వివిధ పోస్టులకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్న విషయం విదితమే కాగా.. త్వరలోనే టీఎస్ టెట్ (TS TET) కూడా జరగనుంది.. ఇప్పటికే ఆన్లైన్లో హాల్ టికెట్లను ఉంచారు అధికారులు.. చాలా మంది అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు.. ఈ నెల 15న టెట్ నిర్వహించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా టెట్ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది..
Read Also: US Crime: అమెరికాలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఏపీ విద్యార్థిని మృతి.. నవ్వుతున్న పోలీసులు
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
రెండు పేపర్లుగా అంటే పేపర్ -1, పేపర్ -2గా టెట్ నిర్వహించబోతున్నారు.. ఈ నెల 15వ తేదీన జరగనున్న టెట్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. టెట్ నేపథ్యంలో.. ఎగ్జామ్ సెంటర్స్ పడిన స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.. టెట్ సెంటర్లలో 14వ తేదీన హాఫ్ డే స్కూల్ మాత్రమే నిర్వహించనున్నారు.. ఇక, పరీక్ష జరిగే 15వ తేదీన ఆయా స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గత ఏడాది టెట్ నిర్వహించిన విద్యాశాఖ.. టీఎస్ టెట్-2023 నోటిఫికేషన్ ఆగస్టులో విడుదల చేసింది.. ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది.. 2.83 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, టెట్లో అర్హత సాధించినవారికే డీఎస్సీ, గురుకుల లాంటి వివిధ ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించిన పరీక్షలకు అర్హులు కావడంతో.. తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు ఫ్యూచర్ పంతుల్లు. ఇక, ఈ ఏడాది పేపర్-1కి 1,139 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-2 పరీక్ష కోసం 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో అత్యధికంగా 92 పరీక్షా కేంద్రాలు, ములుగు జిల్లాలో అత్యల్పంగా 8 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈసారి కూడా టెట్ సిలబస్లో ఎలాంటి మార్పు లేదు. పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకం కోసం పేపర్-1 నిర్వహిస్తారు మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత సాధించేందుకు పేపర్-2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్కు 150 మార్కులు ఉంటాయి. పేపర్-1 పరీక్షలో 1-8 తరగతులకు ప్రామాణిక ప్రశ్నలు మరియు పేపర్-2 పరీక్షలో 6-10 తరగతులకు ప్రామాణిక ప్రశ్నలు ఉంటాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!