Site icon NTV Telugu

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. నేడు ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లు విడుదల..

Tirumala

Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడి దర్శించుకోవాలనే భక్తుల కోసం టీటీడీ నేడు టికెట్లను విడుదల చేయనుంది. ఇవాళ ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, దర్శన స్లాట్‌లను టీటీడీ విడుదల చేయనుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం అంటే అందరికీ కష్టమే. అందుకే ముందుగా బుక్ చేసుకునేందుకు టీటీడీ ఆన్ లైన్‌లో ప్రతి నెలకు సంబంధించి టికెట్లను అందుబాటులో ఉంచనుంది.

Read Also: Ujjaini Mahankali Bonalu: పచ్చి కుండపై నిలబడి రంగం .. దీని వెనుక ఉన్న మహత్యం..?

మరో వైపు తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుమలలోని 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 75,963 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,956 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం హుండీ ఆదాయం 3.99 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

Exit mobile version