Site icon NTV Telugu

Paper Leak Case: ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టులో కౌంటరు దాఖలు చేసిన టీఎస్‌పీఎస్సీ

Highcourt

Highcourt

Paper Leak Case: ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐ చేత విచారణ చేయించాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో టీఎస్‌పీఎస్సీ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అదనపు కార్యదర్శి సుమతి పేరుతో అఫిడవిట్ దాఖలైంది. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి తరఫున అదనపు కార్యదర్శి అఫిడవిట్‌ను దాఖలు చేశారు. సిట్‌ తన నివేదికను షీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించింది. ఇదిలా ఉండగా.. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోకి ప్రవేశించి పేపర్స్ దొంగలించిన కేసులో బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. పేపర్ లీకేజీతో చాలా పరీక్షలు రద్దు చేసినట్టు టీఎస్‌పీఎస్సీ కోర్టుకు తెలిపింది.

Read Also: Rajanna Siricilla Medical College: రాజన్న సిరిసిల్ల మెడికల్‌ కాలేజీకి అనుమతి

ఈ కేసుకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. ఆ తర్వాత కేసు సిట్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్న కారణంగా ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని టీఎస్‌పీఎస్సీ అఫిడవిట్‌లో కోరింది. ఈ కేసుపై విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

Exit mobile version