Site icon NTV Telugu

TSLPRB : ఎక్సైజ్ కానిస్టేబుళ్ల శిక్షణ పై అసత్య ప్రచారం

Police

Police

ప్రభుత్వం మొత్తం 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇఛ్చింది. 555 అభ్యర్థులు సెలెక్టయ్యారు. ఫిబ్రవరి 14న ఎంపికైన ఎక్సైజ్ కానిస్టేబుళ్ల కు ప్రభుత్వం అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చింది. ఏప్రిల్ 13వ తేదీ వరకు జాయినింగ్ టైమ్ ఇచ్చింది. సెలెక్టయిన 555 మంది అభ్యర్థుల్లో ఇప్పటివరకు 397 మంది జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. వీరందరూ 3 నెలల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. 45 రోజులు ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. 120 మంది అభ్యర్థులకు ఎక్సైజ్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణనిచ్చేందుకు షెడ్యూల్ ఖరారైంది. మిగతా అభ్యర్థులను జల్లా టాస్క్ ఫోర్స్, ఎన్ ఫోర్స్మెంట్ టీమ్స్, ఎక్సైజ్ స్టేషన్స్, చెక్ పోస్టుల వద్ద ఫీల్డ్ ట్రైనింగ్ కు పంపించటం జరుగుతుంది. జాయినింగ్ కు ఏప్రిల్ 13వ తేదీ వరకు గడువు ఇచ్చినందున.. ఈలోపు కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వటం లేదనే ఆరోపణలు అర్థరహితమైనవి. ఇప్పటివరకు జాయినైన అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించడమైందన్నారు.

Exit mobile version