Bomb Blast: బెంగాల్‌లో బాంబు పేలుడు.. తృణమూల్ కార్యకర్త మృతి

Trinamool Congress

Trinamool Congress

Bomb Blast: బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని మార్గ్రామ్ వద్ద బాంబు పేలింది. ఈ పేలుడులో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త మరణించగా.. పంచాయతీ పెద్ద గాయపడడం రాజకీయ వర్గాల్లో వాగ్వాదానికి దారితీసింది. దాడికి కాంగ్రెస్ మద్దతుదారులే కారణమని బాధితుడు న్యూటన్ షేక్ కుటుంబ సభ్యులు ఆరోపించగా.. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ మార్గ్రామ్‌లో పార్టీకి ఎలాంటి భౌతిక దాడిలో పాల్గొనే అవకాశం లేదని అన్నారు.

బాంబు దాడిలో న్యూటన్ షేక్ మరణించగా, గాయపడిన లాల్తు షేక్‌ను చికిత్స నిమిత్తం కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి తరలించారు. బీర్భూమ్ జిల్లా జార్ఖండ్‌తో సరిహద్దులను పంచుకోవడంతో ఈ దాడిలో మావోయిస్టుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. దాడి ఎలా మరియు ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని పశ్చిమ బెంగాల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్ అన్నారు. ఇందులో పెద్ద కుట్ర ఉందని.. ఈ బాంబులను తయారు చేయడానికి పదార్థాల మూలాన్ని తప్పనిసరిగా దర్యాప్తు చేయాలని తాను భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Crooked Thief: బొమ్మతుపాకీ చూపించాడు.. అడ్డంగా బుక్కై తన్నులు తిన్నాడు

మార్గ్రామ్‌లో కాంగ్రెస్‌కు సంస్థాగత బలం లేదని పేర్కొన్న చౌదరి, ఈ విషయం తెలిసినప్పటికీ, ఎవరైనా పార్టీకి ప్రచారం కల్పించాలనుకుంటే, దానితో తనకు ఎటువంటి సమస్య లేదని అన్నారు. దాడి చేసినవారు, బాధితులు ఇద్దరూ టీఎంసీకి చెందినవారని అందరికీ తెలుసు అని చౌదరి అన్నారు.