చెన్నైలో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్ళూరు జిల్లా కవారిపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిలబడి ఉన్న గూడ్స్రైలును ఆంధ్రప్రదేశ్కు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఆగివున్న గూడ్స్ ని భాగమతి ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పలుపురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎక్స్ప్రెస్ రైలులోని రెండు కోచ్లు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం తెలుస్తోంది. కొన్ని కోచ్లు పట్టాలు తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటల్లో తగలబడ్డ కోచ్ లను అగ్నిమాపక శాఖ అధికారులు ఫైరింజన్లతో అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల కొన్ని రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. కాగా.. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Train Accident: చెన్నైలో రైలు ప్రమాదం.. ఏపీకి వస్తుండగా ఘటన
- చెన్నై: కవారి రైల్వేస్టేషన్ దగ్గర రైలు ప్రమాదం
- గూడ్స్ రైలును ఢీకొన్న ఎక్స్ ప్రెస్ రైలు
- పలువురికి గాయాలు
- ఏపీకి వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలులో 2 కోచ్లు అగ్నికి ఆహతైనట్లు సమాచారం.