NTV Telugu Site icon

Train Accident: చెన్నైలో రైలు ప్రమాదం.. ఏపీకి వస్తుండగా ఘటన

Train

Train

చెన్నైలో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్ళూరు జిల్లా కవారిపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిలబడి ఉన్న గూడ్స్‌‌రైలును ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ‌‌‌ఢీకొట్టింది. ఆగివున్న గూడ్స్ ని భాగమతి ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పలుపురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎక్స్‌ప్రెస్ రైలులోని రెండు కోచ్‌లు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం తెలుస్తోంది. కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటల్లో తగలబడ్డ కోచ్ లను అగ్నిమాపక శాఖ అధికారులు ఫైరింజన్లతో అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల కొన్ని రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. కాగా.. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.