నయనతార పోస్టర్ పై విగ్నేష్ శివన్ కామెంట్స్..ట్వీట్ వైరల్..
చిత్రనిర్మాత విఘ్నేష్ శివన్ ట్విట్టర్లో తన రాబోయే చిత్రం జవాన్ నుండి భార్య నయనతార పోస్టర్పై స్పందించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో షారుఖ్ ఖాన్ సరసన తొలిసారిగా నయనతార నటిస్తోంది. ఆమె సాధించిన విజయానికి నయనతారను ప్రశంసించిన విఘ్నేష్, ఆమె ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకంగా పేర్కొన్నాడు..
సంతోషంగా, గర్వంగా ఉంది . షారుఖ్ సర్కి అభిమాని కావడం మరియు అతని సినిమాలను మాత్రమే చూడటం నుండి అక్షరాలా అతని సినిమాలు మాత్రమే చూడటం నుండి అంత పెద్ద చిత్రంలో అతని సరసన నటించడం వరకు.. మీ ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది. మీరు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు ప్రియమైన భార్య. మా కుటుంబం మీ గురించి చాలా గర్వంగా ఉంది.. అంతకుముందు.. షారుక్ ఖాన్ జవాన్ నుండి నయనతార పాత్రను తన కొత్త లుక్తో పోలీసుగా పరిచయం చేశాడు. ఎడ్జీ లుక్లో ఆమె చెడ్డగా కనిపించింది. పోస్టర్లో ఆమె మెషిన్ గన్ని పట్టుకుని, మ్యాచింగ్ సన్ గ్లాసెస్తో పూర్తిగా బ్లాక్ లుక్లో స్టైలిష్గా కనిపించింది.
కొత్త కూటమికి అధ్యక్షురాలిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ?
లోక్సభ ఎన్నికలకు ముందు బెంగళూరులో బీజేపీపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. కాంగ్రెస్ విపక్షాల సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి 26 పార్టీల నేతలు చేరుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ కూడా సోమవారం బెంగళూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని మమతా బెనర్జీ కలిశారు. ఇద్దరూ ఒకరి ఆరోగ్యం, క్షేమం గురించి ఒకరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ చర్చ కూడా జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత మమతా బెనర్జీ, సోనియా గాంధీల మధ్య ఈ భేటీ జరిగింది. అంతకుముందు, మమత 2021 జూలైలో సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. ఇద్దరు నేతల మధ్య ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి.
ఇకపై హైదరాబాద్లోనే విమాన ఇంజన్ల రిపేర్లు.. 2024 చివరి నాటికి పరిశ్రమ
హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందని చెప్పడానికి ఈ పరిశ్రమ మరో ఉదాహరణగా నిలవనుంది. ఇప్పటికే హైదరాబాద్ హెల్త్ హబ్గా మారగా.. సాఫ్ట్ వేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ ఆఫీసులను ఏర్పాటు చేసిన తరువాత.. ఇపుడు మరో పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కానుంది. విమాన ఇంజన్లను రిపేర్ చేసే సంస్థ ఇక్కడ ఏర్పాటు కానుంది. జీఎంఆర్ ఏవియేషన్ సెజ్(ఎస్ఈజడ్)లో శాఫ్రాన్ ఎంఆర్వో యూనిట్ ఏర్పాటు కానుంది. ఇది 2024 ఏడాది చివరి నాటికి పూర్తి కానుండగా.. 2025 జనవరి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పరిశ్రమ ద్వారా నేరుగా 1000 మందికి పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయి.
కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం మావల్ల కాదు: ఆస్ట్రేలియా
కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆతిథ్యం నుంచి ఆస్ట్రేలియలోని విక్టోరియా స్టేట్ వైదొలిగింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్ తమ వల్ల కాదని మంగళవారం విక్టోరియా స్టేట్ తేల్చి చెప్పింది. గేమ్స్ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారం ఇచ్చామని, తమ కాంట్రాక్ట్ను రద్దు చేసి వేరే వాళ్లకు ఇవ్వమని కోరినట్లు విక్టోరియా స్టేట్ ప్రతినిధులు తెలిపారు.
ఈనెల 20న జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు
ఈనెల 20న జనసేన పార్టీ తీర్థం పుచుకోనున్నారు మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ.. ఈ నెల 20న సాయంత్రం 4.30 గంటలకు పవన్ కల్యాణ్ సమక్షంలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. 400కార్లు, 25బస్సు ల్లో కార్యకర్తలు, అభిమానులతో అమరావతికి ర్యాలీగా వెళతామని ఆయన వెల్లడించారు. పెందుర్తి నుంచే పోటీ చేయాలనేది అభిమానుల కోరిక అని, పార్టీలో చేరిన తర్వాత జనసేన అధినేత నిర్ణయమే ఫైనల్, ఒక కార్యకర్తగా ఎటువంటి బాధ్యత అప్పగించిన చిత్త శుద్ధితో పని చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఆత్రం ఆగలేదు.. పోస్టింగ్ వచ్చినరోజే లంచం తీసుకుంది.. అరెస్ట్ అయింది
చదువుకున్న యువకులకు ఉద్యోగాలు అవసరం లేదు.. రిక్రూట్మెంట్ చాలా రోజులుగా ఆగిపోయింది.. మరోవైపు యువ అధికారులు కూడా కనిపిస్తున్నారు. సివిల్ (పబ్లిక్ సర్వీస్ కమీషన్) పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఆఫీసర్ అవ్వాలనేది చాలా మందికి కల. దాని కోసం చాలా మంది రాత్రింభవళ్లు కష్టపడుతారు. లక్షలు ఖర్చుపెట్టి ఖరీదైన కోచింగ్ క్లాసులు తీసుకుంటారు. ఆ తర్వాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే త్వరగా డబ్బు సంపాదించవచ్చు అనేది కొందరి ఆలోచన. పేద ప్రజలకు సేవ చేయాల్సిన అధికారి అవినీతికి పాల్పడి ఏసీబీ వలకు చిక్కింది. ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది.. షాకింగ్ విషయం ఏంటంటే మేడమ్ ఉద్యోగంలో చేరిన తొలిరోజే రికవరీ కొబ్బరికాయ కొట్టడంతో ఈ కేసు వైరల్గా మారింది.
మీర్ పేట్లో దారుణం.. బీర్ బాటిల్ కోసం హత్య..!
మీర్ పేట్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బీర్ బాటిళ్లు ఇవ్వనందుకు కొందరు యువకులు కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి జిల్లెల్ల గూడలో సాయి వర ప్రసాద్ అనే వ్యక్తి బీర్ బాటిల్ తీసుకుని రోడ్డు మార్గంలో వెళుతుండగా కొందరు యువకులు అడ్డుకున్నారు. బీఆర్ బాటిల్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీకు ఎందుకు ఇవ్వాలని యువకులను సాయి ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్,సంతోష్ యాదవ్,పవన్ అనే నలుగురు యువకులు సాయిపై దాడి చేశారు. అయినా సాయి బీర్ బాటిళ్లు ఇవ్వలేదు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సాయిపై ఆ నలుగురు దాడి చేస్తుండటంతో సాయి గట్టిగా అరచాడు. దీంతో ఎక్కడ స్థానికులు వస్తారని కత్తితో సాయిని పొడిచారు.
తగ్గిన వర్షాలు.. పెరిగిన విద్యుత్ డిమాండ్
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, ఈ ఖరీఫ్ సీజన్లో తక్కువ వర్షపాతం కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఎందుకంటే రైతులు భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడవలసి వచ్చింది. మొక్క ఎదుగుదల మరియు వరి మార్పిడి ప్రారంభ దశలలో పంటలను నిలబెట్టడానికి విద్యుత్ వినియోగం పెరిగింది. 2018 జనవరిలో వ్యవసాయానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారిగా, ఈ జూలైలో ట్రాన్స్మిషన్ సిస్టమ్తో పాటు రోజువారీ శక్తి వినియోగంపై అత్యధిక ఇంట్రా-డే డిమాండ్ను నమోదు చేసింది. IMD గణాంకాల ప్రకారం, సోమవారం ఉదయం నాటికి సగటు వర్షపాతం లోటు 25 శాతం ఉంది, 32 గ్రామీణ జిల్లాల్లో 21 ఇప్పటికీ సగటు వర్షపాతం లోటు 20 శాతం నుండి 60 శాతం వరకు ఉంది.
తల నొప్పిగా మారిన సైబర్ మోసాలు.. ఫిర్యాదుకు ప్రత్యేక హెల్ప్లైన్
ఇటీవలి కాలంలో రోజుకో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది స్కామర్లు సులభంగా డబ్బు సంపాదించడానికి మోసాలబాట ఆశ్రయిస్తున్నారు. అమాయక ప్రజల విశ్వాసాన్ని మాయమాటలతో దోచుకుంటున్నారు. బహుమతులు, కేవైసీ అప్ డేట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఓఎల్ ఎక్స్, లాటరీల పేరుతో మోసం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో మహిళలు పోస్ట్ చేసిన ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారు. ప్రొఫైల్లను డౌన్లోడ్ చేయడం, వాటిని అసభ్యకరంగా మార్చడం మరియు ఇతర సైట్లు, గ్రూప్లలో పోస్ట్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది స్కామర్లు డేటింగ్ సైట్లలో ఫోటోలు, ఫోన్ నంబర్లు మరియు ఇతర వివరాలను ఉంచి మహిళలను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొన్ని మ్యాట్రిమోనీ సైట్లు కూడా సైబర్ నేరగాళ్ల వేధింపులకు గురవుతున్నాయి.
రాహుల్ గాంధీ పిటిషన్పై విచారణ.. 21న లిస్ట్ చేసిన సుప్రీం కోర్టు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభ్యర్థన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. కేసును విచారించేందుకు ఈ నెల 21న లిస్ట్ చేసింది. పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ నెల 21న విచారణ చేపడతామని మంగళవారం రాహుల్ గాంధీ తరపున న్యాయవాదికి సీజేఐ బెంచ్ స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇన్ని లక్షలమంది చిరువ్యాపారులకు ఎక్కడా ఇంత మేలు జరడం లేదు
రాష్ట్ర వ్యాప్తంగా చిరువ్యాపారులకు చేయూతనందించడానికి సీఎం జగన్ ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ నిధులను విడుదల చేసారు సీఎం జగన్. ఈ పథకం ద్వారా 5,10,412 మంది లబ్ధిదారులకు రూ.10వేలకు పైబడి రుణాలు అందజేశారు. రూ. 11.03 కోట్ల వడ్డీ రియంబర్స్మెంట్తో కలిపి రూ.560.73 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు సీఎం జగన్. ఇప్పటి వరకూ చిరువ్యాపారులకు రూ. 2,955.79 కోట్ల రుణాలు అందజేసింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పటి వరకూ ప్రభుత్వం చెల్లించిన వడ్డీ రూ.74.69 కోట్లు. అయితే.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ఇన్ని లక్షలమందికి ఈ రకంగా మంచి చేయడం లేదన్నారు. ఇన్ని లక్షలమంది చిరువ్యాపారులకు ఎక్కడా ఇంత మేలు జరడం లేదని, దేశం మొత్తం ఇస్తున్న రుణాలు కంటే ఆంధ్ర రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉందని ఆయన వెల్లడించారు. ఈ పథకాన్ని పగడ్బందీగా నడుపుతున్న బ్యాంకర్లు, సచివాలయాల వ్యవస్థ, మెప్మా.. తదితర శాఖలకు అభినందనలు తెలిపారు సీఎం జగన్. పేదవాడికి మంచి జరిగించే యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోందని, ఇంతవరకూ 15.87 లక్షలమంది చిరువ్యాపారులకు మంచి జరిగిందన్నారు.
సిద్దిపేటలో దారుణం… భార్యని చంపి భర్త పరార్
ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం అయిపోయాయి. గొడవలు వచ్చినప్పుడు వాటిని సామరస్యంగా పరిష్కరించుకుని జీవితాన్ని గడపాల్సింది పోయి ఈగోలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో చిన్న చిన్న సమస్యలకే భార్య భర్తల మధ్య అగాధం పెరిగిపోతుంది. వాటి ప్రభావం పిల్లలపై పడుతుంది. గోరింత కలహాలు కొండంతగా కనిపించడంతో దాడులు చేసుకుంటూ కుటుంబాలకు దూరమవుతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకునే రోజులు పోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకునే రోజులు వచ్చాయి. కుటుంబ కలహాలతో భర్త భర్యను హత్య చేసి పరారైన ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపింది.
జగనన్న సురక్ష ప్రచారంలో చారిత్రాత్మక మైలురాయి
జగనన్న సురక్ష ప్రచారంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. జగనన్న సురక్ష పథకంతో 50 లక్షలకుపైగా మందికి అవసరమైన ధృవపత్రాలతో సాధికారత కల్పించారని, ఆంధ్రప్రదేశ్ అంతటా 9725 శిబిరాలు నిర్వహించి 1.13 కోట్లకుపైగా కుటుంబాలు సర్వే చేయబడ్డాయని తెలిపారు. ప్రతి పౌరుడి సంక్షేమం పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉన్న తిరుగులేని నిబద్ధతకు ఈ ఘన విజయం నిదర్శనమని తెలిపారు. ఈ అద్భుతమైన విజయాన్ని జరుపుకోవడంలో మాతో చేరండి మరియు జగనన్న సురక్ష క్యాంపెయిన్ గురించి ప్రచారం చేయండి, ఇది జీవితాలను మారుస్తుంది మరియు అందరికీ ఉజ్వల భవిష్యత్తును భద్రపరుస్తుంది.. అంటూ.. #JaganannaSuraksha #AndhraPradeshProgress అంటూ హ్యాష్ట్యాగ్లను షేర్ చేసింది.
