Producer Shyam Prasad Reddy Wife Vara Lakshmi Dead: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్, మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి (62) కన్నుమూశారు. గత కొంత కాలంగా కాన్సర్ మహమ్మారితో పోరాడిన ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు. వరలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.