Toli Ekadasi 2025: నేడు తొలి ఏకాదశి.. ముహూర్తం, పూజా విధానం ఇవే!
- నేడు తొలి ఏకాదశి
- శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన ఏకాదశి
- తొలి ఏకాదశి ముహూర్తం
- పూజకు శుభ సమయం డీటెయిల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడాదిలో 24 ఏకాదశులు ఉండగా.. ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. ఈ కాలాన్ని చాతుర్మాసంగా పిలుస్తారు. హిందూ మతంలో ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి.. విష్ణువుని పూజిస్తూ మోక్షాన్ని కోరుకుంటారు. శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన ఏకాదశి ఇదే. హిందూ సాంప్రదాయం ప్రకారం.. నేటి నుంచి అన్ని పండుగలు ప్రారంభమవుతాయి.
పూజకు శుభ సమయం:
ఈరోజు తొలిఏకాదశి పర్వదినం. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఏకాదశి తిథి జూలై 5 సాయంత్రం 6:58 గంటలకు ప్రారంభమై.. జూలై 6 రాత్రి 9:14 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం. తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది.
Also Read
- Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
- PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
- Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
Also Read: Shubman Gill: శుభ్మన్ గిల్ సెంచరీల మోత.. రికార్డులే రికార్డులు!
పూజా విధానం:
తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. పూజా మందిరాన్ని శుద్ధి చేసుకుని.. లక్ష్మినారాయణుల ఫొటోబు శుభ్రంగా తుడిచి గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి.. మూడు వత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి. తులసి, చామంతి వంటి పసుపు రంగు పూలతో విష్ణుమూర్తిని పూజించాలి. తెల్ల గన్నేరు, నందివర్ధనం, తుమ్మి, జాజీ పూలు కూడా సమర్పించుకోవాలి.
‘ఓం నమోః నారాయణాయ, ఓం నమోః భగవతే వాసుదేవాయ’ అనే రెండు మంత్రాలు చదువుకుంటూ పూజ చేయాలి. విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. తీపి పదార్థాలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి. పూజ ప్రారంభించే ముందు ఈ ఏకాదశి వ్రతాన్ని పూర్తి భక్తితో ఉపవాసం ఉండి ఆచరిస్తాను అని శ్రీమహావిష్ణువు ముందు సంకల్పం చెప్పుకోవాలి. ఇలా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
-
PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!