Toli Ekadasi 2025: నేడు తొలి ఏకాదశి.. ముహూర్తం, పూజా విధానం ఇవే!
- నేడు తొలి ఏకాదశి
- శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన ఏకాదశి
- తొలి ఏకాదశి ముహూర్తం
- పూజకు శుభ సమయం డీటెయిల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడాదిలో 24 ఏకాదశులు ఉండగా.. ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. ఈ కాలాన్ని చాతుర్మాసంగా పిలుస్తారు. హిందూ మతంలో ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి.. విష్ణువుని పూజిస్తూ మోక్షాన్ని కోరుకుంటారు. శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన ఏకాదశి ఇదే. హిందూ సాంప్రదాయం ప్రకారం.. నేటి నుంచి అన్ని పండుగలు ప్రారంభమవుతాయి.
పూజకు శుభ సమయం:
ఈరోజు తొలిఏకాదశి పర్వదినం. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఏకాదశి తిథి జూలై 5 సాయంత్రం 6:58 గంటలకు ప్రారంభమై.. జూలై 6 రాత్రి 9:14 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం. తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది.
Also Read
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
- US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
Also Read: Shubman Gill: శుభ్మన్ గిల్ సెంచరీల మోత.. రికార్డులే రికార్డులు!
పూజా విధానం:
తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. పూజా మందిరాన్ని శుద్ధి చేసుకుని.. లక్ష్మినారాయణుల ఫొటోబు శుభ్రంగా తుడిచి గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి.. మూడు వత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి. తులసి, చామంతి వంటి పసుపు రంగు పూలతో విష్ణుమూర్తిని పూజించాలి. తెల్ల గన్నేరు, నందివర్ధనం, తుమ్మి, జాజీ పూలు కూడా సమర్పించుకోవాలి.
‘ఓం నమోః నారాయణాయ, ఓం నమోః భగవతే వాసుదేవాయ’ అనే రెండు మంత్రాలు చదువుకుంటూ పూజ చేయాలి. విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. తీపి పదార్థాలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి. పూజ ప్రారంభించే ముందు ఈ ఏకాదశి వ్రతాన్ని పూర్తి భక్తితో ఉపవాసం ఉండి ఆచరిస్తాను అని శ్రీమహావిష్ణువు ముందు సంకల్పం చెప్పుకోవాలి. ఇలా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!