Toli Ekadasi 2025: నేడు తొలి ఏకాదశి.. ముహూర్తం, పూజా విధానం ఇవే!
- నేడు తొలి ఏకాదశి
- శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన ఏకాదశి
- తొలి ఏకాదశి ముహూర్తం
- పూజకు శుభ సమయం డీటెయిల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడాదిలో 24 ఏకాదశులు ఉండగా.. ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. ఈ కాలాన్ని చాతుర్మాసంగా పిలుస్తారు. హిందూ మతంలో ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి.. విష్ణువుని పూజిస్తూ మోక్షాన్ని కోరుకుంటారు. శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన ఏకాదశి ఇదే. హిందూ సాంప్రదాయం ప్రకారం.. నేటి నుంచి అన్ని పండుగలు ప్రారంభమవుతాయి.
పూజకు శుభ సమయం:
ఈరోజు తొలిఏకాదశి పర్వదినం. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఏకాదశి తిథి జూలై 5 సాయంత్రం 6:58 గంటలకు ప్రారంభమై.. జూలై 6 రాత్రి 9:14 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం. తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది.
Also Read
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్పై రూ.17 వేలు తగ్గింపు..
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
Also Read: Shubman Gill: శుభ్మన్ గిల్ సెంచరీల మోత.. రికార్డులే రికార్డులు!
పూజా విధానం:
తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. పూజా మందిరాన్ని శుద్ధి చేసుకుని.. లక్ష్మినారాయణుల ఫొటోబు శుభ్రంగా తుడిచి గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి.. మూడు వత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి. తులసి, చామంతి వంటి పసుపు రంగు పూలతో విష్ణుమూర్తిని పూజించాలి. తెల్ల గన్నేరు, నందివర్ధనం, తుమ్మి, జాజీ పూలు కూడా సమర్పించుకోవాలి.
‘ఓం నమోః నారాయణాయ, ఓం నమోః భగవతే వాసుదేవాయ’ అనే రెండు మంత్రాలు చదువుకుంటూ పూజ చేయాలి. విష్ణుమూర్తికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. తీపి పదార్థాలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి. పూజ ప్రారంభించే ముందు ఈ ఏకాదశి వ్రతాన్ని పూర్తి భక్తితో ఉపవాసం ఉండి ఆచరిస్తాను అని శ్రీమహావిష్ణువు ముందు సంకల్పం చెప్పుకోవాలి. ఇలా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
-
Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
-
IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!