Today Stock Market Roundup 17-04-23: ఐటీసీ షేర్.. బెస్ట్ పెర్ఫార్మర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today stock Market Roundup 17-04-23: దేశీయ స్టాక్ మార్కెట్కి ఈ వారం శుభారంభం లభించలేదు. వరుసగా 9 రోజులు వచ్చిన లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమై సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిసింది. బెంచ్ మార్క్ ఇండెక్స్లు ఒక శాతానికి పైగా పడిపోయాయి.
read more: Telangana Exports: తెలంగాణకు సముద్ర తీరం లేకపోయినా..
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో తదితర ఐటీ స్టాక్స్ సరైన పనితీరు కనబరచకపోవటమే దీనికి కారణం. అయితే.. బ్యాంకులు మరియు ఎఫ్ఎంసీజీ షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపటంతో ఇంట్రాడేలో వచ్చిన భారీ నష్టాల నుంచి కాస్త కోలుకున్నాయి.
చివరికి.. సెన్సెక్స్ 520 పాయింట్లు కోల్పోయి 59 వేల 910 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ.. 121 పాయింట్లు తగ్గి 17 వేల 706 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 18 కంపెనీలు లాభాల బాట పట్టగా మిగతా 12 కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో ప్రధానంగా నెస్లె ఇండియా, ఏసియన్ పెయింట్స్ మెరవగా.. టాటా స్టీల్ విప్రో నేల చూపులు చూశాయి. నిఫ్టీ 50లో బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టాక్గా ఐటీసీ నిలిచింది. ఈ సంస్థ షేరు విలువ ఏడాది కాలంలో 48 శాతానికి పైగా పెరిగింది. ఇవాళ 400 రూపాయలు దాటింది.
భవిష్యత్తులో 500 రూపాయలను కూడా క్రాస్ చేయనుందని పెట్టుబడిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 10 గ్రాముల బంగారం రేటు 246 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 60 వేల 575 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 308 రూపాయలు పెరిగి.. గరిష్టంగా 76 వేల 45 రూపాయలు పలికింది.
క్రూడాయిల్ రేటు నామమాత్రంగా 23 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 744 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 13 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 2 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!