Today Stock Market Roundup 02-03-23: ‘అదానీ’పై కనిపించని ‘సుప్రీం’ ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Stock Market Roundup 02-03-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే మిగిలాయి. 8 రోజుల నష్టాల తర్వాత నిన్న బుధవారం లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లో ఇవాళ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ రోజు గురువారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమై కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న రెండు కీలక సూచీలు ఇంట్రాడేలో కూడా కోలుకోలేకపోయాయి.
ఐటీ మరియు బ్యాంకులు, ఆటోమొబైల్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిణ్ని ఎదుర్కోవటంతో సాయంత్రం భారీ నష్టాల్లో ముగిశాయి. టీసీఎస్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి పెద్ద పెద్ద సంస్థల షేర్లు పడిపోవటం దెబ్బతీసింది. ఇదిలాఉండగా.. అదానీ గ్రూప్ కంపెనీలపై దర్యాప్తు జరిపి 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సెబీని ఆదేశించింది. అయితే.. ఈ తీర్పు ఆ ప్రభావం అదానీ గ్రూప్ షేర్లపైన పడలేదు.
Also Read
- YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
Indian Companies Q3 Earnings: విశ్లేషకులు చెప్పినదానికన్నా మంచి ఫలితాలు
ఫలితంగా.. అవి స్వల్ప లాభాలతో ట్రేడింగ్ను ముగించాయి. సెన్సెక్స్ 502 పాయింట్లు కోల్పోయి 58 వేల 909 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 129 పాయింట్లు తగ్గి 17 వేల 321 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 25 కంపెనీలు నేల చూపులు చూశాయి.
మారుతి, యాక్సిస్ సంస్థల షేర్ల విలువ ఘోరంగా దిగజారింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో మిడ్క్యాప్ మరియు స్మాల్క్యాప్ సుమారు సున్నా పాయింట్ 2 శాతం విలువ కోల్పోయాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ రాణించింది.
దాదాపు ఒక శాతం లాభపడింది. నిఫ్టీ ఐటీ సూచీ మాత్రం బాగా వెనకబడింది. ఒక శాతానికి పైగా డౌన్ అయింది. వ్యక్తిగత స్టాక్స్ను పరిశీలిస్తే.. RVNL షేర్ల విలువ 10 శాతం పెరిగింది. 200 వందే భారత్ ట్రైన్ల తయారీకి పోటీ పడుతున్న సంస్థల జాబితాలో ఈ కంపెనీ సైతం నిలవటం సానుకూలంగా మారింది.
సొనాటా సాఫ్ట్వేర్ స్టాక్స్ 5 శాతం ర్యాలీ తీశాయి. 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 79 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 55 వేల 751 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 651 రూపాయలు కోల్పోయింది.
అత్యధికంగా 63 వేల 284 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 107 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 466 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 9 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 59 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!