Site icon NTV Telugu

Gold Rates: మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

Gold

Gold

బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. నేడు తులంపై రూ. 300 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,764, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,950 వద్ద ట్రేడ్ అవుతోంది. గోల్డ్ ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 పెరిగింది. దీంతో రూ. 89,500 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 330 పెరిగింది. దీంతో రూ. 97,640 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

Also Read:Russia Ukraine War: ట్రక్కుల్లో 117 డ్రోన్లు,18 నెలల ప్లానింగ్.. రష్యాను దారుణంగా దెబ్బతీసిన ఉక్రెయిన్..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 989,650 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,790 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు పరుగులు పెడుతుండగా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడు కిలో వెండిపై రూ. 100 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,11,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,00,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Exit mobile version