ఓ రోజు తగ్గుతూ మరో రోజు పెరుగుతూ గోల్డ్ ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. నేడు తులం పసిడి ధర రూ. 50 పెరిగింది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,933, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,105 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 పెరిగింది. దీంతో రూ.91,050 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 పెరిగింది. దీంతో రూ. 99,330 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,150 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,480 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,24,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,14,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
