Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Today 25 01 23 Business Headlines Local State National International Important News

Today (25-01-23) Business Headlines: ‘ఆటమ్’.. బాంబ్‌ కాదు. ఇండెక్స్‌. మరిన్ని వార్తలు.

Published Date :January 25, 2023 , 3:10 pm
By Akkirala Kondala Rao
Today (25-01-23) Business Headlines: ‘ఆటమ్’.. బాంబ్‌ కాదు. ఇండెక్స్‌. మరిన్ని వార్తలు.
  • Follow Us :
  • google news
  • dailyhunt

Today (25-01-23) Business Headlines

Airtel మినిమం రీఛార్జ్ రూ.155

Airtel ప్రీపెయిడ్ మినిమం రీఛార్జ్ ఒక్కసారే 57 శాతం పెరిగి 155 రూపాయలకు చేరింది. దీంతో ఇప్పుడున్న 99 రూపాయల ప్లాన్ రద్దయింది. కొత్త ప్లాన్.. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో అమలవుతుంది. ఇందులో భాగంగా అన్ లిమిటెడ్ కాల్స్, ఒక జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్ అందిస్తారు. హలో మ్యూజిక్, వింక్ మ్యూజిక్ సర్వీసులు సైతం ఉచితం. అయితే.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కొంత మందికి 28 రోజులు, మరికొంత మందికి 24 రోజులుగా చూపిస్తుండటం గమనించాల్సిన విషయం.

‘కాఫీ డే’కి రూ.26 కోట్ల ఫైన్

కాఫీ డే సంస్థ కష్టాలు మళ్లీ పెరిగాయి. అప్పుల ఊబి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోందని భావిస్తున్న తరుణంలో.. గతంలో చేసిన తప్పిదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. కాఫీ డే కంపెనీకి 26 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 45 రోజుల్లోపు ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ గడువు పెట్టింది. 7 అనుబంధ సంస్థల నుంచి కాఫీ డే ప్రమోటర్ సంస్థకు 3 వేల 535 కోట్ల రూపాయలు మళ్లించారని, అవి తర్వాత కాఫీ డే దివంగత అధినేత విజి సిద్ధార్థ మరియు ఆయన కుటుంబ సభ్యులకు బదిలీ అయ్యాయని సెబీ గుర్తించి ఫైన్ వేసింది.

తెర పైకి మరో సూచీ.. ‘ఆటమ్’

ఇండియన్ మార్కెట్’లో మరో ఇండెక్స్ తెర మీదికి వచ్చింది. ఆ సూచీ పేరు ఆటమ్. దీన్నే.. ఐరావత్ టచ్ స్టోన్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అని కూడా అంటారు. స్టాక్ ఎక్సేంజ్’లో రిజిస్టరైన 30 మధ్య తరహా సంస్థలే ఇందులో ఉంటాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు వీలైన మరియు ఉత్తమ పాలన అమల్లో ఉన్న సంస్థలను ఎంపిక చేశారు. ఇండియన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీల అసోసియేషన్’లోని 150 మధ్య తరహా సంస్థల నుంచి వీటిని సెలెక్ట్ చేశారు.

‘టాటా ట్రస్ట్’కి కొత్త సీఈఓ, సీఓఓ

టాటా సన్స్ సంస్థలో మెజారిటీ వాటా.. 66 శాతం షేర్ ఉన్న టాటా Trustsకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్’గా సిద్ధార్థ్ శర్మ నియమితులయ్యారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్’గా అపర్ణ ఉప్పలూరిని సెలెక్ట్ చేశారు. వీళ్లిద్దరూ నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజు.. ఏప్రిల్ ఒకటిన బాధ్యతలు చేపడతారు. CEO పదవి నుంచి ఎన్.శ్రీనాథ్ గతేడాది చివరలో తప్పుకోవటంతో ఆయన స్థానంలో సిద్ధార్థ్ శర్మను ఎంపిక చేశారు. ఈయన ప్రస్తుతం టాటా కంపెనీలోనే CSOగా చేస్తున్న సంగతి తెలిసిందే.

గోవా, బెంగళూరులకు నేటి నుంచే

దేశీయ విమానయాన రంగంలోకి కొత్తగా ప్రవేశించిన ఆకాశ ఎయిర్.. ఇవాళ.. హైదరాబాద్ నుంచి బెంగళూరు, గోవాలకు డైలీ సర్వీసులను ప్రారంభిస్తోంది. వచ్చే నెల 15వ తేదీ నుంచి బెంగళూరుకి అదనంగా మరో 2 సర్వీసులను నడపనుంది. ఈ విషయాన్ని సంస్థ కోఫౌండర్ అండ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ వెల్లడించారు. త్వరలో విదేశీ సర్వీసులను ప్రారంభించే ఆలోచన కూడా ఉందని చెప్పారు. ఆకాశ ఎయిర్ అమ్ములపొదిలో ప్రస్తుతం 14 విమానాలు ఉన్నాయని, 15 రోజులకొక విమానం చేరుతోందని తెలిపారు.

టెస్లాలో 3 వేల మంది నియామకం

ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. కొత్తగా 3 వేల మంది వర్కర్లను నియమించుకుంటోంది. నెవడ గిగా ఫ్యాక్టరీ విస్తరణలో భాగంగా ఈ రిక్రూట్మెంట్ చేపట్టింది. ఫ్యాక్టరీ విస్తరణ కోసం 3 పాయింట్ 6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. టెస్లా సంస్థకు చెందిన విద్యుత్ వాహనాల్లో అమర్చేందుకు కావాల్సిన బ్యాటరీ ప్యాక్’లను ఈ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. ఈ ఫ్యాక్టరీని ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగులా నిర్మించాలని టెస్లా ప్రణాళికలు రచించింది. ఆ భవన నిర్మాణం ప్రస్తుతానికి దాదాపు 30 శాతం మాత్రమే పూర్తయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • airtel minimum recharge
  • Akasa Air
  • atom index
  • fine to coffee day
  • flights from hyderabad

తాజావార్తలు

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • Allu Arjun Remuneration: ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు.. ‘రాకా’ కోసం అల్లు అర్జున్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా?

  • Yamuna River: యమునా నదిలో ఘోర పడవ ప్రమాదం.. స్పాట్‌లో 9 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

  • Amit Shah: బాబ్రీ మసీదు వాళ్లతో కలవడం కన్నా, 20 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటాం

  • Stock Market: స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్స్.. రికార్డు స్థాయిలో సిప్‌(SIP)లు.. కారణం ఇదే..

ట్రెండింగ్‌

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions