NTV Telugu Site icon

Tirumala Vykunta Dwara Darshan: టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ .. ఎక్కడంటే?

Ttd1

Ttd1

కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఏడాది చివరకు రావడం, సెలవులు కూడా కలిసి రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఇదిలా ఉంటే.. జనవరి 1వ తేదిన ఆఫ్ లైన్ విధానంలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు జారీచేయనుంది టీటీడీ. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా టోకెన్లు జారీ చేస్తోంది.

టోకెన్లు జారీచేసే కేంద్రాలివే!

1.భూదేవి కాంప్లెక్స్
2.రామచంద్ర పుష్కరిణి
3.జీవకోన జేడ్పి హైస్కూల్
4.తుడా ఇందిరా మైదానం
5.విష్ణు నివాసం
6.శ్రీనివాసం
7.గోవిందరాజ సత్రాలు
8.బైరాగిపట్టేడ జడ్పి హైస్కూల్
9.శేషాద్రినగర్ జడ్పి హైస్కూల్…ఈ కేంద్రాలు ద్వారా టోకెన్లు జారీచేస్తామని టీటీడీ తెలిపింది. రోజుకి 50 వేల చోప్పున….జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు సంబంధించిన 5 లక్షల టోకెన్లు జారీచేస్తామని, భక్తులు ఈ సౌకర్యం వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.

మరోవైపు 16 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు 70,373 మంది భక్తులు….తలనీలాలు సమర్పించిన 32,954 మంది భక్తులు…హుండీ ఆదాయం రూ. 5.05 కోట్లుగా టీటీడీ తెలిపింది. రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు… ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాదన సేవను రద్దు చేసింది టీటీడీ… ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టీటీడీ..రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.

Read Also: Droupadi Murmu: తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతిముర్ము పర్యటన.. స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం