NTV Telugu Site icon

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి అమ్ముతున్న ముగ్గురు మహిళల అరెస్ట్..

Ganja

Ganja

హైదరాబాద్‌లో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఆంధ్రా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్న ముగ్గురు మహిళలను అరెస్ట్‌ చేశారు. ధూల్‌పేట్‌కు చెందిన గీతాబాయ్, శీలాబాయ్, క్రాంతిలను అరెస్ట్‌ చేశారు. వీరు గత కొంతకాలంగా ఎక్సైజ్‌ అధికారులకు దొరక్కుండా తిరుగుతున్నారు. ఈ వనితలు ధూల్‌పేట్‌ను అడ్డాగా చేసుకుని గంజాయ్ అమ్ముతున్నారు. ఏపీ, ఒడిశా నుంచి గంజాయి తెచ్చి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

READ MORE: Bollywood: భయపెట్టి కాసుల పంట పండించుకుంటున్న బాలీవుడ్‌

మరోవైపు హైదరాబాద్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన అజయ్ నుంచి 70 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏను సీజ్ చేశారు. బెంగళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముందుగా బుక్‌చేసుకున్న కస్టమర్లకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. బస్సులో డ్రగ్స్‌ను పార్శిల్‌ పంపి తర్వాత వచ్చి అమ్మతున్నాడు. ఎక్సైజ్‌ అధికారులు అజయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.