Prayagraj: ఏసీ కోచ్ నుండి దిగి ప్లాట్ఫారమ్ పై కుర్చున్న దొంగలు.. చెమటలు పట్టడంతో అసలు విషయం బట్టబయలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thefts In Train Prayagraj: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), GRP సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ముగ్గురు నేరస్థులను అరెస్టు చేశారు. ఈ నిందితులు దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో రైల్వే ప్లాట్ఫారమ్పైకి వచ్చారు. కానీ, పోలీసులు సకాలంలో చర్య కారణంగా వారి ప్రణాళిక విఫలమైంది. అందిన సమాచారం ప్రకారం, ఈ సంఘటన హౌరాలోని ప్లాట్ఫారమ్ నెం. 1 లో జరిగింది. అక్కడ ముగ్గురు AC కోచ్ నుండి దిగి కూర్చున్నారు. వారి కార్యకలాపాలను చూసిన GRP సభ్యులు, ఈ వ్యక్తులు AC కోచ్ నుండి దిగిన వారు చెమటతో తడిసిపోయారని గమనించారు. AC కోచ్లో ఎటువంటి లోపం లేకపోవడంతో GRP వారిని విచారించారు. దర్యాప్తులో ముగ్గురి చేతుల్లో రెండు మొబైల్ ఫోన్లు ఉన్నాయని తేలింది. దీనిని గమనించిన GRP వారిని అదుపులోకి తీసుకుంది.
Read Also: Pakistan: భారత్ దెబ్బకు పాకిస్థాన్ మార్కెట్ కుదేలు.. కిలో చికెన్ రూ.800!
Also Read
- Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
విచారణ సమయంలో, ఈ నేరస్థులు తమను తాము సంజయ్ కుమార్, వినోద్ కుమార్, దిలీప్ సాహుగా గుర్తించుకున్నారని చెబుతున్నారు. ఈ ముగ్గురు నేరస్థులను పట్టుకోవడానికి చాలా కాలం నుండి వెతుకుతున్న దొరకలేదు. ఇక పోలీసులు ఈ సోదాల్లో దొంగిలించబడిన వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఒక ఉంగరం, మరో 6 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఈ మొబైల్స్ మొత్తం ధర దాదాపు రూ.1,50,000 ఉంటుందని అంచనా. ఇక ప్రయాణీకులు, వారి లగేజీ భద్రత కోసం ‘ఆపరేషన్ ప్యాసింజర్ సెక్యూరిటీ’ ప్రచారం కింద ఇటువంటి చర్యలు నిరంతరం తీసుకుంటున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ ప్రచారం కింద, రైల్వే స్టేషన్లు, రైళ్లలో నేరస్థులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడంలో విజయం సాధిస్తున్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!