Prayagraj: ఏసీ కోచ్ నుండి దిగి ప్లాట్ఫారమ్ పై కుర్చున్న దొంగలు.. చెమటలు పట్టడంతో అసలు విషయం బట్టబయలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thefts In Train Prayagraj: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), GRP సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ముగ్గురు నేరస్థులను అరెస్టు చేశారు. ఈ నిందితులు దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో రైల్వే ప్లాట్ఫారమ్పైకి వచ్చారు. కానీ, పోలీసులు సకాలంలో చర్య కారణంగా వారి ప్రణాళిక విఫలమైంది. అందిన సమాచారం ప్రకారం, ఈ సంఘటన హౌరాలోని ప్లాట్ఫారమ్ నెం. 1 లో జరిగింది. అక్కడ ముగ్గురు AC కోచ్ నుండి దిగి కూర్చున్నారు. వారి కార్యకలాపాలను చూసిన GRP సభ్యులు, ఈ వ్యక్తులు AC కోచ్ నుండి దిగిన వారు చెమటతో తడిసిపోయారని గమనించారు. AC కోచ్లో ఎటువంటి లోపం లేకపోవడంతో GRP వారిని విచారించారు. దర్యాప్తులో ముగ్గురి చేతుల్లో రెండు మొబైల్ ఫోన్లు ఉన్నాయని తేలింది. దీనిని గమనించిన GRP వారిని అదుపులోకి తీసుకుంది.
Read Also: Pakistan: భారత్ దెబ్బకు పాకిస్థాన్ మార్కెట్ కుదేలు.. కిలో చికెన్ రూ.800!
Also Read
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
విచారణ సమయంలో, ఈ నేరస్థులు తమను తాము సంజయ్ కుమార్, వినోద్ కుమార్, దిలీప్ సాహుగా గుర్తించుకున్నారని చెబుతున్నారు. ఈ ముగ్గురు నేరస్థులను పట్టుకోవడానికి చాలా కాలం నుండి వెతుకుతున్న దొరకలేదు. ఇక పోలీసులు ఈ సోదాల్లో దొంగిలించబడిన వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఒక ఉంగరం, మరో 6 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఈ మొబైల్స్ మొత్తం ధర దాదాపు రూ.1,50,000 ఉంటుందని అంచనా. ఇక ప్రయాణీకులు, వారి లగేజీ భద్రత కోసం ‘ఆపరేషన్ ప్యాసింజర్ సెక్యూరిటీ’ ప్రచారం కింద ఇటువంటి చర్యలు నిరంతరం తీసుకుంటున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ ప్రచారం కింద, రైల్వే స్టేషన్లు, రైళ్లలో నేరస్థులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడంలో విజయం సాధిస్తున్నారు.
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి