Premature Babies : ఏటా 10లక్షల శిశువులు మరణిస్తున్నారు.. డబ్ల్యూహెచ్ఓ సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Premature Babies : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) , యునిసెఫ్ మంగళవారం విడుదల చేసిన సంయుక్త నివేదిక ప్రకారం ప్రపంచంలో ఏటా ఒక మిలియన్ కంటే ఎక్కువ నెలలు నిండకుండానే శిశువులు మరణిస్తున్నారు. 2020 సంవత్సరంలో ప్రపంచంలోని 45 శాతం శిశువులు నెలలు నిండకుండానే జన్మించారు. వారు ఎక్కువగా ఐదు దేశాల్లో పాకిస్థాన్, నైజీరియా, చైనా, ఇథియోపియా, భారతదేశంలో జన్మించారు. 2020లో బంగ్లాదేశ్లో 16 శాతం కంటే ఎక్కువ ముందస్తు జనన రేటు ప్రపంచంతో పోలీస్తే అత్యధికంగా నమోదైంది. సంఖ్యాపరంగా చూస్తే 30.16 లక్షల జననాలతో భారతదేశం మొదటి స్థానంలో ఉంది.
2020లో 9.14 లక్షల మంది పిల్లలతో పాకిస్తాన్ రెండవ స్థానంలో ఉంది. గత దశాబ్దంలో 152 మిలియన్ శిశువులు నెలలు నిండకుండానే జన్మించారు. పుట్టిన ప్రతి 10 మందిలో ఒకరు నెలలు నిండకుండానే ఉన్నారు. ప్రతి 40 సెకన్లకు ఈ పిల్లలలో ఒకరు చనిపోతున్నారు. ఒక దశాబ్దంలో ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ అకాల జనన రేటులో ఎటువంటి మార్పు లేదు. సంఘర్షణ, వాతావరణ మార్పు, కోవిడ్ ప్రతిచోటా మహిళలు, శిశువులకు ప్రమాదాలను పెంచుతున్నాయి.
Also Read
ముందస్తు జనన రేటు ఇక్కడ అత్యధికం
బంగ్లాదేశ్ 16.2%
మలావి 14.5 %
పాకిస్తాన్ 14.4%
భారతదేశం 13.0 %
దక్షిణా ఆఫ్రికా 13.0%
Read Also:MI vs RCB: సూర్య ప్రతాపానికి ఆర్సీబీ భస్మం.. ముంబై ఘనవిజయం
ఈ దేశాల్లో అపరిపక్వ పిల్లల సంఖ్య అత్యధికం
భారతదేశం 30,16,700
పాకిస్థాన్ 9,14,000
నైజీరియా 7,74,100
చైనా 7,52,900
ఇథియోపియా 4,95,900
తల్లి ఆరోగ్య సమస్యల కారణంగానే..
తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్నందున చాలాసార్లు నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనివ్వాల్సి భారతీయ వైద్యులు విశ్వసిస్తున్నారు. కరోనా మొదటి వేవ్లో ఇన్ఫెక్షన్ కారణంగా తల్లి, బిడ్డ ఇద్దరి జీవితాలు ప్రమాదంలో ఉన్నందున ఇటువంటి కేసులు పెరిగాయి. దేశంలో 2014లో మొత్తం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (NICUలు) 18 ఉండగా ఇప్పుడు 700 కంటే ఎక్కువ జిల్లాల్లో 900 కంటే ఎక్కువ ఉన్నాయి. న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్ వైద్యురాలు డాక్టర్ నీర్జా మాట్లాడుతూ, పరిపక్వత చెందని పిల్లలలో ప్రాణాపాయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పిల్లలలో చాలామంది పుట్టిన ఐదు రోజులకే మరణిస్తున్నారు. బతికిన వారు కూడా భవిష్యతులో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
Read Also:Rajahmundry Crime: వైసీపీ నేత దారుణ హత్య.. అసలు కారణం ఇదే..!
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!