MLAs Resign: హిమాచల్ప్రదేశ్లో కీలక పరిణామం.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇటీవల రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారిగా అలజడి జరిగింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడడంతో అనూహ్యంగా బీజేపీ రాజ్యసభ సీటును తన్నుకుపోయింది. ఈ ఘటన ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది.
తాజాగా మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి తమ రాజీనామాలను సమర్పించారు. ముగ్గరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఈ ముగ్గురు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆశిష్ శర్మ (హమీర్పూర్ నియోజవర్గం), హోషియార్ సింగ్ (డెహ్రా), కేఎల్ ఠాకూర్ (నాలాగఢ్) శుక్రవారం ఉదయం అసెంబ్లీలో విపక్ష నేత జైరామ్ ఠాకూర్ను కలుసుకున్నారు. అనంతరం తమ రాజీనామాను అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. హోషియార్ సింగ్ ఈ విషయం మీడియాకు తెలియజేశారు. తమ రాజీనామాను అసెంబ్లీ సెక్రటరీకి అందజేశామని, బీజేపీలో చేరనున్నామని చెప్పారు. బీజేపీ టిక్కెట్పై తాము పోటీ చేయనున్నట్టు తెలిపారు.
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేయడంతో ప్రభుత్వం ఇరాకటంలో పడింది. హిమాచల్ప్రదేశ్లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్కు 40, బీజేపీకి 25, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. అయితే కాంగ్రెస్కు ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్కు 34, బీజేపీకి 34 ఓట్లు వచ్చాయి. అనంతరం లక్కీ డ్రా తీయడంతో రాజ్యసభ సీటును బీజేపీకి గెలుచుకుంది. ఇదిలా ఉంటే ఆరుగురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ స్పీకర్ బహిష్కరణ వేటు వేశారు. ఇటీవల ఆ నియోజకవర్గాలకు ఈసీ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. తాజాగా మరో ముగ్గురు రాజీనామా చేశారు. వీరు కూడా బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. దీంతో ప్రభుత్వం మరింత సంక్షోభం దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. మరి భవిష్యత్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!