NTV Telugu Site icon

Haryana : పాఠశాల బాత్‌రూమ్‌లో పదేళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ప్రిన్సిపాల్‌

Rape

Rape

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు పదేళ్ల విద్యార్థినిపై దారుణంగా ప్రవర్తించాడు. నాలుగో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికపై ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ పాఠశాల బాత్ రూంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక వాంగ్మూలం మేరకు నిందితుడు ప్రిన్సిపాల్ యశ్‌పాల్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హర్యానా రాష్ట్రం జింద్ జిల్లా నర్వానా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తన 10 ఏళ్ల కుమార్తె ఓ ప్రైవేట్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం పాఠశాల నుంచి వచ్చిన కుమార్తె మనస్తాపానికి గురైంది. ఏమైందని అడిగితే ఆ పెద్దగా చెప్పలేదు. ఆ తర్వాత అకస్మాత్తుగా తల్లి, తండ్రి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం విన్న బాలిక గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది.

READ MORE: Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర కొనసాగుతున్న హైడ్రామా

స్కూల్లో ప్రిన్సిపాల్, ఇంట్లో తల్లిదండ్రులు తనను హాయిగా బతకనివ్వడం లేదని ఏడ్చింది. ఆ అమ్మాయి ప్రిన్సిపాల్ గురించి ఎందుకు ఇలా అంటుందో అని తల్లిదండ్రులు షాక్ అయ్యారు. వెంటనే బాలికను కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ తర్వాత శుక్రవారం పాఠశాల గదిలో కూర్చున్నట్లు బాలిక చెప్పింది. “అంతలో అక్కడికి ప్రిన్సిపాల్ వచ్చాడు. ప్రిన్సిపాల్ అవతలి గది కిటికీని మూయమని అడిగాడు. బాలిక కిటికీ మూసేస్తుండగా ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చాడు. స్కూల్ కొత్త హాలు చూపిస్తానని ప్రిన్సిపాల్ చెప్పాడు. తన వెంట తీసుకెళ్లాడు. బాలికను హాల్లోకి కాకుండా బాత్రూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ప్రిన్సిపాల్ తప్పుడు పనులు చేశాడు.” అని బాలిక తెలిపింది.