NTV Telugu Site icon

Poster Released: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ..

Sports Day

Sports Day

Poster Released: ఎల్బి స్టేడియంలో ఆగస్టు 29 రోజున జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి , ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ ,ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్ ను, టీ షర్ట్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.

Vizianagaram: నెల్లిమర్ల ఈవీఎం గోదాం తాళాలు మిస్సింగ్.. కలెక్టర్ సీరియస్..

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆగష్టు 29 న ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా స్పోర్ట్స్ డే లో భాగంగా పోస్టర్, లోగోఆవిష్కరించడం జరిగింది. ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన అని తెలిపారు. ఇటీవల కొరియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ క్రీడా సంస్థలు క్రీడాకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తరువాత, తెలంగాణ లో కూడా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల నుండి తెలంగాణ లో ప్రజా పాలన లో క్రీడాకారులను వారి నైపుణ్యాలను బయటకు తెచ్చివిధంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అందులో భాగంగా జాతీయ క్రీడా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. రాష్ట్రం భవిష్యత్ లో క్రీడా రంగంలో నంబర్ వన్ గా ఉండాలి. క్రీడా రంగంలో భవిష్యత్ లో పాఠశాల దశ నుండి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని ప్రయత్నంలో భాగంగా క్రీడా దినోత్సవం ఘనంగా జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రులు , ఎమ్మేల్యేలు, ప్రభుత్వ అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని.. 29 నాడు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేస్తారని తెలిపారు.

CPI Naryana: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలి..

అన్ని జిల్లాల్లో క్రీడా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని., ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిన తల్లిదండ్రుల స్పందన ముఖ్యం పిల్లలను ప్రోత్సహించాలని తెలిపారు.. శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయ్యారని.. స్పోర్ట్స్ కోసం పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరుగుతుందని.. కరీంనగర్ లో కూడా స్పోర్ట్స్ స్కూల్ ఉందని., స్పోర్ట్స్ కార్యక్రమానికి తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.