NTV Telugu Site icon

Loksabaha Elections 2024: ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ నామినేషన్ తిరస్కరణ..

Shyam

Shyam

ప్రముఖ హాస్యనటుడు, యూట్యూబర్ శ్యామ్ రంగీలా అభ్యర్థిత్వాన్ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. అఫిడవిట్ సమర్పించనందున శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. శ్యామ్ రంగీలా ప్రధాని నరేంద్ర మోడీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన సంగతి తెలిసిందే.. శ్యామ్ రంగీలా మిమిక్రీ ఆర్టిస్ట్.. అతను ప్రధాని మోడీ, రాహుల్ గాంధీతో సహా చాలా మంది నాయకులను అనుకరించేవాడు. దీంతో ఆయన పలుమార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు.

Slovakia: స్లోవేకియా ప్రధానిపై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం..

కొద్ది రోజుల క్రితం నుంచి ప్రధాని మోడీపై ఎన్నికల్లో పోటీ చేస్తానని శ్యామ్ ప్రకటిస్తూ వస్తున్నాడు. శ్యామ్ రంగీలా ఎంతో కృషి తర్వాత వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇందుకోసం సోషల్ మీడియాలో నిరంతరం పోస్టులు పెట్టేవాడు. అయితే.. నామినేషన్ తిరస్కరణకు గురైన తర్వాత.. భావోద్వేగానికి గురయ్యాడు. శ్యామ్ రంగీలా మాట్లాడుతూ.. కష్టపడి కష్టపడి నిన్న వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశామని చెప్పారు. తాము అన్ని పత్రాలు, ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకుని నమోదు చేశామని.. కానీ ఈరోజు మీరు నామినేషన్ సమయంలో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చలేదని చెప్పారు. దీని కారణంగా నామినేషన్ ఫారమ్ తిరస్కరించబడిందని ఎన్నికల అధికారులు తెలిపారన్నారు. కాగా.. కొద్దిరోజుల క్రితం తనను నామినేషన్ దాఖలు చేసేందుకు అనుమతించడం లేదంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఎన్నో వివాదాల తర్వాత మే 14న నామినేషన్ దాఖలు చేశారు.

AP Elections 2024: ఈసీకి ఏం చెబుదాం..? సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ మల్లగుల్లాలు..!

వారణాసి లోక్‌సభ స్థానానికి జూన్ 1న ఏడో దశలో పోలింగ్ జరగనుంది. ఈ సీటుపై బీజేపీ నుంచి ప్రధాని మోడీ మూడోసారి అభ్యర్థిగా బరిలోకి దిగగా, అజయ్ రాయ్‌ను భారత కూటమి అభ్యర్థిగా నిలబెట్టింది.