Pune Porsche case: 300పేజీల వ్యాసం కోర్టుకు సమర్పించిన మైనర్.. ఏం రాశాడంటే..?
- పోలీసులతో ఇబ్బందు వస్తాయని భయపడి పారిపోయినట్లు తెలిపిన మైనర్
- ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రజలు పరుగులు తీయకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లాలని రాసిన నిందితుడు
- ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె పోర్షే కేసు మైనర్ నిందితుడు తన 300 పదాల వ్యాసాన్ని బాంబే కోర్టుకు అందజేశాడు. జేజేబీ ఆదేశం ప్రకారం.. తన 300 పదాల వ్యాసాన్ని సమర్పించాడు. మద్యం మత్తులో పోర్షే కారును నడుపుతూ.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి, ఇద్దరు మరణానికి ఆ నిందితుడు కారణమన్న విషయం తెలిసిందే. అతడికి బెయిల్ మంజూరు చేస్తూ..300 పేజీల పదాల వ్యాసం రాయాలని కోర్టు ఆదేశించింది కోర్టు.
READ MORE: Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లికి రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీ..
Also Read
వ్యాసంలో మైనర్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్రమాదం సమయంలో పోలీసులతో ఇబ్బంది పడతానని భయపడ్డట్లు తెలిపాడు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రజలు పరుగులు తీయకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లాలని రాశాడు. మే 19వ తేదీ రాత్రి ప్రమాదం జరిగిన తర్వాత తాను భయపడి ఎవరినీ సంప్రదించలేదని కూడా రాశాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పారిపోయానని తెలిపాడు. స్థానికులు అతడిని పట్టుకుని చంపేందుకు ప్రయత్నించారని పేర్కొన్నాడు. అనంతరం మైనర్ బాలుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మైనర్ విజ్ఞప్తి చేశాడు. దీంతో పాటు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులను సంప్రదించి ప్రమాదంలో గాయపడిన వారిని ఆదుకోవాలని పేర్కొన్నాడు. కాగా.. తన 300 పదాల వ్యాసంలో.. మైనర్ నిందితుడు కళ్యాణి నగర్ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి నేరాన్ని అంగీకరించలేదని వర్గాలు తెలిపాయి. మే 19న జరిగిన పూణె పోర్షే ప్రమాదంలో మధ్యప్రదేశ్కి చెందిన ఇద్దరు టెకీలు మరణించారు. ఈ ఘటనలో నిందితుడు.. ఒక మైనర్ అని, మద్యం తాగిన మత్తులో బండి నడిపి యాక్సిడెంట్ చేశాడని తేలడంతో.. దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రేకెత్తాయి. నేరస్థుడికి మొదట బలహీనమైన కారణాలతో బెయిల్ మంజూరు చేయడం జరిగిందని పలువురు ఆరోపించారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!