Site icon NTV Telugu

Crime: రూ.300కోట్ల ఆస్తి కోసం మామను హత్య చేయించిన కోడలు.. కట్ చేస్తే..

New Project (68)

New Project (68)

ఆస్తి కోసం మామను హతమార్చేందుకు ఓ కోడలు ప్లాన్ వేసింది. తాను అనుకున్నట్లు గానే ఆ ప్లాన్ ఫలించింది. ఓ వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చి తన మామను కారుతో గుద్దించి చంపేసింది. పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కేసు నమోదు చేసుకున్నారు. కట్ చేస్తే.. మృతుడి సోదరుడికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులను సంప్రదించి ఇది ప్రమాదం కాదని హత్య అని ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

READ MORE: Kerala: బస్సులో నుంచి కిందపడబోతున్న ప్రయాణికుడిని కండక్టర్ ఎలా కాపాడాడో చూడండి..

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రూ.300 కోట్ల ఆస్తిని లాక్కోవడానికి కోడలు తన సొంత మామని కాంట్రాక్టు ఇచ్చి హత్య చేయించింది. తొలుత ఈ కేసును యాక్సిడెంట్‌గా చూపించే ప్రయత్నం జరిగింది. మే 22న నాగ్‌పూర్‌లోని మానేవాడ కాంప్లెక్స్‌లో పురుషోత్తం పుట్టేవార్ (82 )ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు మృతి చెందారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ప్రమాదంపై పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేశారు.

ఘటన అనంతరం మృతుడి సోదరుడు తనకు హత్యగా అనుమానిస్తున్నట్లు పోలీసు అధికారికి తెలిపారు. ఆ దిశగా పోలీసులు విచారణ ప్రారంభించగా.. ఒకదాని తర్వాత మరొకటి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో సీసీటీవీ ఆధారంగా పోలీసులు కారు డ్రైవర్లు నీరజ్ నిమ్జే, సచిన్ ధర్మిక్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో.. ఇద్దరూ మృతుడి కోడలు అర్చన పుట్టేవార్ నుంచి డబ్బు తీసుకొని ఆమె మామగారిని కారుతో ఢీకొట్టినట్లు పోలీసులకు చెప్పారు. అర్చన ప్రభుత్వ అధికారి అనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది.

Exit mobile version