NTV Telugu Site icon

Axis My India Exit Poll : ఎగ్జిట్ పోల్స్ విఫలమవ్వడంతో టీవీ షో మధ్యలో ఏడ్చిన సంస్థ ఎండీ

New Project (20)

New Project (20)

లోక్‌సభ ఎన్నికల్లో చాలా ఎగ్జిట్ పోల్ పూర్తిగా విఫలమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌ను తోసిపుచ్చాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 350కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కాని అసలు ఫలితాల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చేలా కనిపించడం లేదు. ఎగ్జిట్ పోలింగ్ ఏజెన్సీ యాక్సిస్ మై ఇండియా ఎండీ ప్రదీప్ గుప్తా బీజేపీ 400 సీట్లకు పైగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే షో మధ్యలో ప్రదీప్ గుప్తా ఏడవడం మొదలుపెట్టారు. ఎగ్జిట్ పోల్‌లో ఎక్కడ పొరపాటు జరిగిందో ప్రదీప్ గుప్తా లైవ్ షోలో చెప్పారు. అతను తప్పుగా లెక్కించినందుకు క్షమాపణలు చెప్పారు.

READ MORE: Ponnam Prabhakar: బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి.. నైతికంగా గెలిచాం

‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్‌లో ఎన్డీయేకు 361-401 సీట్లు వస్తాయని పేర్కొంది. ‘భారత్’ కూటమి 131-166 సీట్లతో సంతృప్తి చెందాల్సి ఉంటుందని గుప్తా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా వ్యతిరేకం. బీజేపీ సొంతంగా మెజారిటీకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో ప్రదీప్ గుప్తా ఎగ్జిట్ పోల్ పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఫలితాలకు ఒక రోజు ముందు..తమ 69 ఎగ్జిట్ పోల్స్‌లో 65 సరైనవని ప్రదీప్ చెప్పారు. ఎగ్జిట్ పోల్‌ను ‘మోడీ మీడియా పోల్’ మరియు ‘ఫాంటసీ పోల్’ అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అభివర్ణించారు.

రాహుల్‌ని బ్రాండ్‌గా చూడలేదు..
ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ .. “భారత కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసింది. తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ వంటి వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు పోటీ చేశాయి. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లలో రాహుల్‌ గాంధీ బ్రాండ్‌గా కనిపించడం లేదు. కాంగ్రెస్‌ ఓటర్లు రాహుల్‌గాంధీ పేరు మీద ఓటు వేయరు. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, ఏర్పాట్లను బట్టి ఓటు వేస్తారు.” అని చెప్పుకొచ్చారు.