సూపర్ స్టార్ రజనీకాంత్ అప్పట్లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ముత్తు. 28 ఏళ్ల కిందట విడుదల అయి సంచలన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు రీరిలీజ్ల ట్రెండ్ నడుస్తుండటంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అంతా భావించారు.అలాగే రీరిలీజ్ తేదీని కూడా చాలా రోజుల కిందటే అనౌన్స్ చేశారు. అయితే తీరా రిలీజ్ సమయానికి మాత్రం షోలన్నింటినీ రద్దు చేయాల్సి వచ్చింది.ముత్తు సినిమా రీరిలీజ్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి అసలు ఎలాంటి స్పందనా లేదు. అసలు టికెట్లు అమ్ముడుపోకపోవడంతో అన్ని షోలనూ కూడా రద్దు చేశారు. గత కొంతకాలంగా టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే..ముఖ్యంగా తెలుగు లో పెద్ద హీరోలు మహేష్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి మరియు బాలకృష్ణ వంటి వాళ్ల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి.కొన్ని సినిమాలు సంచలన వసూళ్లు సాధించగా.. మరికొన్ని చూసేవాళ్లు లేక షోలు రద్దు చేయాల్సి వచ్చింది.
తాజాగా రజనీకాంత్ ముత్తుకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. 1995లో రిలీజైన ఈ సినిమా తమిళనాడులో 175 రోజులు ఆడి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత జపాన్ లో కూడా రిలీజై ఊహించని విజయం సొంతం చేసుకుంది.అయితే ఈ ఏడాది జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి రజనీకాంత్ ఫుల్ ఫామ్ లో ఉండటంతో ముత్తు సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావించారు. కానీ అంతా రివర్సయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోకపోవడంతో షోలను రద్దు చేయాలని థియేటర్లు యజమానులు నిర్ణయించారు.రీసెంట్ గా ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ మూవీ రీ రిలీజ్ అయింది.. ఆ సినిమాకు ఆదరణ అంతగా లభించలేదు.. దీనితో రీ రిలీజ్ ట్రెండ్ ముగిసినట్టే అని అంతా భావిస్తున్నారు.. ఇదిలా ఉంటే రజనీకాంత్ పుట్టినరోజు (డిసెంబర్ 12) నేపథ్యంలో డిసెంబర్ 9న అతని మరో హిట్ మూవీ శివాజీ ది బాస్ రీరిలీజ్ కానుంది.ముత్తు సినిమాను పట్టించుకోని ప్రేక్షకులు మరి శివాజీ మూవీని అయిన ఆదరిస్తారో లేదో చూడాలి..