తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్, బీ ఫార్మసీ వంటి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో సీట్ల భర్తీకి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈఏపీసెట్ 2026) పరీక్షల షెడ్యుల్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ ఎప్ సెట్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయ్ కుమార్ రెడ్డి , కన్వీనర్ ఎప్ సెట్ , జెఎన్టియూ హెచ్ మాట్లాడుతూ.. ఎప్ సెట్ పరీక్ష పూర్తి అవ్వగానే ప్రిలిమినరీ మార్క్స్ కాండిడేట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయన్నారు.
Also Read:MLC Nagababu: భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు.. ‘కోవా బన్’ వలీకి అండగా నాగబాబు!
వెంటనే ప్రిలిమినరీ మర్క్స్ తెలియడం వల్ల పిల్లల్లో ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. మొబైల్ ద్వారా కూడా ఎప్ సెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రిజిస్ట్రేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు ఈ సారి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఇంటర్ బోర్డు నుంచి విద్యార్థులు ఏ స్ట్రీమ్ కి చెందిన వారో వివరాలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు దరఖాస్తులో తెలియక స్ట్రీమ్ తప్పుగా పెడితే హెల్ప్ డెస్క్ నుంచి కాల్ చేసి సమాచారం ఇస్తామని తెలిపారు. ఎడిట్ ఆప్షన్ ద్వారా విద్యార్థులు మళ్ళీ స్ట్రీమ్ మార్చే అవకాశం ఉంటుందన్నారు.
Also Read:Star Actress : రూ. 500 నుండి రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కు స్టార్ హీరోయిన్
మే 2వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎప్ సెట్లో తప్పులు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ సారి సబ్ క్యాస్ట్ లను సైతం పరిగణలోకి తీసుకుంటున్నామని విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలో వైద్య సహాయం అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. డయాబెటిస్ ఇబ్బంది ఉన్నవాళ్లు వారి వైద్యుల ప్రిస్క్రిప్షన్ అందిస్తే వారికి అవసరమైన సహాయం అందిస్తామని వెల్లడించారు.
