Telugu Film Producers Council Joint Pressmeet: సంక్రాంతి అంటేనే సినిమాల జోరు, ఈ క్రమంలో ఈ ఏడాది ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో సంక్రాంతి బరిలో సినిమాల రిలీజ్ పై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ సోషల్ మీడియా, వెబ్ సైట్స్, న్యూస్ ఛానల్స్ ఎప్పుడు ఇండస్ట్రీకి సపోర్ట్ గానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని సార్లు వాళ్లకు వచ్చే న్యూస్ ద్వారా ఇండివిడ్యువల్ గా డ్యామేజ్ జరుగుతోందని అన్నారు. సంక్రాంతి పండక్కి ఎప్పుడూ సినిమాల పోటీ ఉంటుంది కాని 15 రోజుల క్రితం ప్రొడ్యూసర్స్ మీట్లో మేము తీసుకున్న డెసిషన్ కి ఒప్పుకుని ఈగల్ టీం వెనక్కి తగ్గిందన్నారు. ఛాంబర్ అడగగానే విశ్వ ప్రసాద్, వివేక్, రవితేజ ఒప్పుకొని బరిలో నుంచి తప్పుకోవడంతో మిగతా నాలుగు సినిమాలకు కొంత స్క్రీన్ దొరికి బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ : సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల మీద తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రొడ్యూసర్స్ మీట్ పెట్టడం జరిగింది. ఆ మీట్ కి ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి వారి ఇబ్బందులు వాళ్ళు చెప్పుకున్నారు. అలా సంక్రాంతి బరిలో నుంచి వెనక్కి తగ్గిన ఈగల్ మూవీ టీం ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్, వివేక్, రవితేజకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.
ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈసారి కూడా పలు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. 15 రోజుల క్రితం చాంబర్ తరఫున పలువురు ప్రొడ్యూసర్స్ ని పిలిచి గ్రౌండ్ రియాలిటీ బిజినెస్ గురించి మాట్లాడటం జరిగింది. ఆ మీటింగ్ లో మేం చెప్పింది ఆలోచించి వెనక్కి తగ్గి తమ సినిమాను వాయిదా వేసుకున్న ఈగల్ మూవీకి కృతజ్ఞతలు. ఇందులో ఎవరికీ వ్యక్తిగత లాభం లేదు ఇది అందరి సినిమాల కోసం ఆలోచించి చెప్పిందని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అనుపం రెడ్డి మాట్లాడుతూ : సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న ఈగల్ టీం పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి రవితేజ గారికి కృతజ్ఞతలు. ఇది మా సినిమా ఇండస్ట్రీ యొక్క ఐకమత్యాన్ని తెలియజేస్తుంది అన్నారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు , సెక్రటరీ దామోదర్ ప్రసాద్ , తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సునీల్ నారంగ్ , అనుపం రెడ్డి , తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ , దామోదర్ ప్రసాద్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ , నిర్మాతలు నిరంజన్ రెడ్డి వివేక్ కూచిబొట్ల చిత్తూరు శ్రీను మరియు వెంకట్ బోయినపల్లి పాల్గొన్నారు.