Site icon NTV Telugu

TG IAS Transfers: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఒకేసారి 45 మందికి స్థానచలనం

Ias

Ias

IAS Transfers in Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చోటు చేసుకున్నారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా 45 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం.. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా సంజయ్ కుమార్, SPDCL సీఎండీగా జితేశ్ వి. పాటిల్, కొత్త డిస్కం సీఎండీగా ముషారఫ్ ఫారూకీ, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ. శ్రీధర్, ఐటీ అండ్ సీ (IT & C) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్.. ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్‌ను నియమించింది. అలాగే.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఎం. దాన కిషోర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా, మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా బి. విజయేంద్ర, కరీంనగర్ కలెక్టర్‌గా చిత్ర మిశ్రా, హన్మకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్, యాదాద్రి కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, జనగాం కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝాలను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా సిక్తా పట్నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా బి.ఎం. సంతోష్, లేబర్ స్పెషల్ కమిషనర్‌గా పమేలా సత్పతి, కోఆపరేటివ్ కమిషనర్‌గా పి.ఎస్. రాహుల్ రాజ్, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా స్నేహ శబర్ష్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరిమా అగర్వాల్, వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా దీపక్ తివారీ, అదనపు కలెక్టర్‌గా ఉమా శంకర్ ప్రసాద్, మెదక్ జిల్లా కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్‌కు బాధ్యతులు అప్పజెప్పింది.

READ MORE: Oil Free Mutton Paneer: ఆయిల్ లేకుండానే అదిరిపోయే మటన్ పన్నీర్.. ఒక్కసారి తిన్నారంటే!

Exit mobile version