Telangana Govt Hikes Minimum Wages for Workers: తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. జీవన వ్యయం, ఉపాధి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్మికులను నాలుగు వర్గాలుగా విభజించి కొత్త వేతనాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్స్కిల్డ్ (నైపుణ్యం లేని) కార్మికుల కనీస వేతనాలను రూ.12 వేల నుంచి రూ.16 వేలకు పెంచారు. అలాగే సెమీ స్కిల్డ్ కార్మికులకు ప్రస్తుతం ఉన్న రూ.13 వేల నుంచి రూ.15 వేలకు పెంపు కల్పించారు. ఇక స్కిల్డ్ కార్మికుల విషయంలో కూడా వేతనాల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్కిల్డ్ కార్మికుల కనీస వేతనాలను రూ.17 వేల నుంచి రూ.18 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం

Minimum Wage Rates Workers