Site icon NTV Telugu

పవన్ కళ్యాణ్ ను అభినందించిన గవర్నర్‌

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను తెలంగాణ గవర్నర్‌ తమిళి సై అభినందించారు. కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య కు జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేయడాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై అభినందించారు. కళాకారుడి కి పవన్‌ కళ్యాణ్‌ సాయం అందించడం ఎంతో స్ఫూర్తికరమన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై. పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై. కాగా… కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య కు నిన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే.

Exit mobile version