TS DSC Exam: తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష వాయిదా వేశారు. ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20 నుండి నవంబర్ 30 వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడగా.. తాజాగా డీఎస్పీ కూడా వాయిదా వేశారు.
Read Also: Lifestyle : మీకు విపరీతంగా కోపం వస్తుందా? అయితే ఈ టిప్స్ ను తప్పక పాటించాల్సిందే..
డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా.. 5,089 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషాపండితులు, పీఈటీ పోస్టులున్నాయి. ఈ పరీక్షలను నవంబర్ 20 నుంచి 30 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తామని అనుకున్నారు. కానీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. అక్టోబర్ 21 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు.