DOST Notification: దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. మూడు విడుతల్లో అడ్మిషన్స్
DOST Notification: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (DOST-2024) నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. దీని ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, మహిళా యూనివర్సిటీ, జేఎన్టీయూ, పాలిటెక్నిక్లోని డీ-ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అడ్మిషన్ ప్రక్రియ మూడు రౌండ్లలో నిర్వహించనుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎంపిక చేయనుంది. రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Read also: CM YS Jagan: పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక అంతే.. జగన్ వార్నింగ్
Also Read
- West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..
- AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
- Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత - నాగచైతన్య.. అది కూడా పార్ట్నర్స్తో!
1. మొదటి బ్యాచ్ రిజిస్ట్రేషన్లు మే 6న ప్రారంభం కానున్నాయి.ఈ నెల 25 వరకు విద్యార్థులు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న విద్యార్థులు మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు.జూన్ 3న సీట్లు కేటాయిస్తారు.జూన్ 4 నుంచి 10 వరకు విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాలి.
2. రెండో దశ రిజిస్ట్రేషన్ జూన్ 4న ప్రారంభమవుతుంది. 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూన్ 4 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లు చేసుకోవచ్చని.. జూన్ 18న సీట్లు కేటాయిస్తారని, సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 19 నుంచి 24లోగా ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాలని సూచించారు.
3. చివరి మూడవ విడుత రిజిస్ట్రేషన్ జూన్ 19న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 25 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని.. అదే నెల 19 నుంచి 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చని తెలిపారు. జూన్ 29న సీట్లు కేటాయిస్తారు.అదే రోజు నుంచి జూలై 3 వరకు విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాలి. ఇదిలా ఉండగా మూడో విడుత రిజిస్ట్రేషన్లకు విద్యార్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. జూలై 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
అయితే.. గతేడాది డిగ్రీ కాలేజీల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో సహా 1,054 కాలేజీలు దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను ఆయా డిగ్రీ కాలేజీల్లో దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు.
CM YS Jagan: పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక అంతే.. జగన్ వార్నింగ్
తాజావార్తలు
-
Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
-
West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
-
Babar Azam: కోహ్లీకి బాబర్ ఆజం షాక్.. సొంత దేశం అభిమానులే ఏకిపారేస్తున్నారు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..
-
Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్మీ స్మార్ట్ఫోన్ ను రూ. 15,000 తక్కువకే కొనండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!