DOST Notification: దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. మూడు విడుతల్లో అడ్మిషన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DOST Notification: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (DOST-2024) నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. దీని ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, మహిళా యూనివర్సిటీ, జేఎన్టీయూ, పాలిటెక్నిక్లోని డీ-ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అడ్మిషన్ ప్రక్రియ మూడు రౌండ్లలో నిర్వహించనుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎంపిక చేయనుంది. రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Read also: CM YS Jagan: పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక అంతే.. జగన్ వార్నింగ్
Also Read
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
1. మొదటి బ్యాచ్ రిజిస్ట్రేషన్లు మే 6న ప్రారంభం కానున్నాయి.ఈ నెల 25 వరకు విద్యార్థులు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న విద్యార్థులు మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు.జూన్ 3న సీట్లు కేటాయిస్తారు.జూన్ 4 నుంచి 10 వరకు విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాలి.
2. రెండో దశ రిజిస్ట్రేషన్ జూన్ 4న ప్రారంభమవుతుంది. 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూన్ 4 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లు చేసుకోవచ్చని.. జూన్ 18న సీట్లు కేటాయిస్తారని, సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 19 నుంచి 24లోగా ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాలని సూచించారు.
3. చివరి మూడవ విడుత రిజిస్ట్రేషన్ జూన్ 19న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 25 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని.. అదే నెల 19 నుంచి 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చని తెలిపారు. జూన్ 29న సీట్లు కేటాయిస్తారు.అదే రోజు నుంచి జూలై 3 వరకు విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాలి. ఇదిలా ఉండగా మూడో విడుత రిజిస్ట్రేషన్లకు విద్యార్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. జూలై 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
అయితే.. గతేడాది డిగ్రీ కాలేజీల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో సహా 1,054 కాలేజీలు దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను ఆయా డిగ్రీ కాలేజీల్లో దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు.
CM YS Jagan: పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక అంతే.. జగన్ వార్నింగ్
తాజావార్తలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?