Chandrababu: టీడీపీ-జనసేన తొలి జాబితాపై సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ.. సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: టీడీపీ-జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీనియర్ నేతలైన అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్బాబు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్తో సమావేశమయ్యారు. టీడీపీ -జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Read Also: TTD EO Dharmareddy: తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం
Also Read
- RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
ఉదయం 11 గంటల తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు – పవన్ విడుదల చేయనున్నారు. 60-70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను చంద్రబాబు – పవన్ ప్రకటించనున్నారు. 50కి పైగా టీడీపీ, 10కి పైగా జనసేన స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ – జనసేనలు ప్రకటించనున్నాయి. ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం తొమ్మిది గంటలకల్లా అందుబాటులో ఉండాలని పలువురి నేతలకు చంద్రబాబు సూచించారు. నాదెండ్ల సహా ఇతర ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. బీజేపీతో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చాక రెండో విడత అభ్యర్థుల జాబితాను కూటమి పార్టీలు ప్రకటించనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ సీట్లల్లో అభ్యర్థుల ప్రకటనకే టీడీపీ – జనసేన పరిమితం కానుంది. బీజేపీతో పొత్తు క్లారిటీ వచ్చాక ఎంపీ సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశముందని కూటమి పార్టీల వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా సిద్ధం కాలేదని తెలుస్తోంది. తొలి జాబితాతో పార్టీ నాయకుల్లో జోష్ నింపేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో ఇరు పార్టీలు ఉమ్మడిగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
-
Bank Holidays in June 2026: జూన్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్!
-
Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
-
Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
-
Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!