Suvendu Adhikari: నేడే సువేందు ప్రమాణ స్వీకారం.. దీదీని గద్దె దించిన బెంగాల్ బాద్షా గురించి ఆసక్తికర విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సరికొత్త శకం ఆరంభమైంది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన సువేందు అధికారి, బెంగాల్ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోల్కతాలోని చారిత్రక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అమిత్ షా స్వయంగా సువేందు అధికారి పేరును ప్రతిపాదించగా, ఎనిమిది వేర్వేరు ప్రతిపాదనలు సైతం ఆయన పేరే సూచించడంతో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఎన్నికైన వెంటనే సువేందు రాజ్భవన్లో గవర్నర్ ఆర్.ఎన్. రవిని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు.
ఇక, 55 ఏళ్ల సువేందు అధికారి ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్థుడైన అనుచరుడిగా ఉండేవారు. ఇప్పుడు అదే మమతాను ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం విశేషం. “బెంగాల్ నుంచి భయం (భోయ్) పోయింది, నమ్మకం (భరోసా) వచ్చింది” అని సువేందు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గత 55 ఏళ్లలో కోల్కతా వెలుపల, అంటే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ముఖ్యమంత్రి అవుతున్న తొలి నేతగా సువేందు రికార్డు సృష్టించబోతున్నారు. 1971లో అజోయ్ ముఖర్జీ తర్వాత జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ సీఎం అవుతున్నది ఈయనే. మాజీ కేంద్ర మంత్రి సిసిర్ అధికారి కుమారుడైన సువేందు, కాంగ్రెస్ విద్యార్థి విభాగం ‘ఛత్ర పరిషత్’ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, ఆపై తృణమూల్ కాంగ్రెస్లో కీలకంగా ఎదిగి, చివరకు బీజేపీలో చేరి మమతా బెనర్జీకి ప్రధాన ప్రత్యర్థిగా మారారు.
Also Read
- Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
ఇక, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ బీజేపీ 207 సీట్లతో ఘనవిజయం సాధించగా, తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. అయితే, ఓటమిని అంగీకరించని మమతా బెనర్జీ, లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, తమ ప్రజాదేశాన్ని కుట్రపూరితంగా దోచుకున్నారని ఆరోపించారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె భీష్మించుకున్నప్పటికీ, గవర్నర్ ఆర్.ఎన్. రవి ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి సువేందును ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. బెంగాల్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, స్థిరమైన పాలన అందిస్తామని బీజేపీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!