Supreme Court: చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు.. సుప్రీం ఆగ్రహం
- చెట్ల నరికివేతపై సుప్రీం ఆగ్రహం
- తదుపరి విచారణ మే 15 కు వాయిదా
- అప్పటి వరకు 'స్టేటస్ కో'.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ అంశంపై నేడు (బుధవారం) జరుగుతున్న విచారణ సందర్భంగా.. “చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు” అంటూ జస్టిస్ బి. ఆర్.గవాయ్ వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు ప్రభుత్వ పక్షాన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి వాదనలు వినిపించారు. అయితే, ఈ విచారణలో.. నాశనం చేసిన వందల ఎకరాల అడవులను మీరు ఎలా పునరుద్ధరిస్తారు? అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలకు తావులేదని స్పష్టం చేసింది. అలాగే మేము చూసిన వీడియోలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. అడవిలో నివసించే జంతువులు షెల్టర్ కోసం పరుగులు తీయగా, వీధుల్లో ఉండే కుక్కలు వాటిని కరిచాయని సమాచారం వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
1996లో ఇచ్చిన తీర్పును విస్మరించి అధికారులు తమకు తాము మినహాయింపులు ఇచ్చుకుంటే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ప్రైవేట్ ఫారెస్ట్ లలో సైతం చెట్లను నరికితే అదే తీరు కొనసాగుతుందని, అటువంటి చర్యలను సీరియస్గా పరిగణిస్తామని పేర్కొంది. భూముల తాకట్టు అంశాలతో తమకు సంబంధం లేదని, నరికిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ఆదేశించింది. డజన్ల బుల్డోజర్లతో వంద ఎకరాలలోని చెట్లను ఎందుకు తొలగించారు? ఇది ఎలా సరైన చర్య అవుతుందని ప్రశ్నించింది.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
అభివృద్ధి అవసరమేనని, కానీ అది పర్యావరణాన్ని నాశనం చేసేలా ఉండకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. సిటీకి గ్రీన్ లంగ్ స్పేస్ అవసరం. వన్యప్రాణుల రక్షణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నాశనం చేసిన అడవులను ఎలా రీస్టోర్ చేస్తారో స్పష్టం చెయ్యండి… అంటూ కోర్టు ప్రశ్నించింది. చెట్ల నరికివేతకు ముందే అనుమతులు తీసుకోవాల్సింది అంటూ జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. మొత్తంగా, చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ.. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. ఈ అంశంపై తదుపరి విచారణను మే 15 కు వాయిదా వేసింది. అప్పటి వరకు ‘స్టేటస్ కో’ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..