Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Supreme Court Orders Against Mamata Banerjee Ed Ipac Case

Supreme Court: సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చుక్కెదురు..

Published Date :January 15, 2026 , 3:26 pm
By RAMAKRISHNA KENCHE
Supreme Court: సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చుక్కెదురు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Supreme Court: సుప్రీంకోర్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చుక్కెదురైంది. ఈడీ విచారణ కేసులో మమతకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీపై బెంగాల్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఆర్‌పై స్టే ఇచ్చింది. ఐ ప్యాక్‌పై ఈడీ దర్యాప్తు సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించిన అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను భద్రపరచాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రిప్లై ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), తృణమూల్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించి కలకత్తా హైకోర్టులో ఇటీవల చోటు చేసుకున్న గందరగోళంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం చాలా తీవ్రమైనదని పేర్కొన్న ధర్మాసనం, ఈ విషయంలో నోటీసులు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈడీ తరఫున వాదించిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఐప్యాక్ కార్యాలయాలపై జరిగిన సోదాల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు రాష్ట్ర అధికారులు తమ దర్యాప్తుకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసం నుంచి ఆధారాలు తీసుకెళ్లారని, ఇది చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలు రాష్ట్ర పోలీసులను కూడా అక్రమాలకు ప్రోత్సహించే ప్రమాదం ఉందని వ్యాఖ్యానిస్తూ, డీజీపీ రాజీవ్ కుమార్ సహా ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు.

READ MORE: Tollywood Sankranthi: టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డ్.. 5 సినిమాలు, 4 హిట్లు.. బాక్సాఫీస్ షేక్!

జనవరి 9న కలకత్తా హైకోర్టులో ఈ కేసు విచారణ సమయంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు గుమిగూడి గందరగోళం సృష్టించారని, దీంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేయాల్సి వచ్చిందని సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. ఈ గందరగోళం ముందుగా వాట్సాప్ సందేశాల ద్వారా న్యాయవాదులను పిలిపించడంవల్లే జరిగిందని ఈడీ వాదించింది. తృణమూల్ లీగల్ సెల్ ఈ వ్యవహారానికి కారణమని పేర్కొంది. ఆ తర్వాత హైకోర్టు విచారణలకు సంబంధిత న్యాయవాదులకే అనుమతి ఇచ్చింది. ఈడీ ఎలాంటి పత్రాలు స్వాధీనం చేసుకోలేదని చెప్పడంతో, తృణమూల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అయితే పార్టీకి సంబంధించిన గోప్య పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని తృణమూల్ ఆరోపిస్తోంది.

READ MORE: Pradakshina: గుడికి వచ్చి ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసా..

మమతా బెనర్జీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈడీ బెంగాల్‌కు రావడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఐప్యాక్ ఎన్నికల నిర్వహణ చూసే సంస్థ అని, తృణమూల్‌తో అధికారిక ఒప్పందం ఉందని చెప్పారు. ఎన్నికల డేటా చాలా రహస్యమైనదని, అది బయటకు వెళ్తే ఎన్నికల్లో పోటీ ఎలా చేయగలమని ప్రశ్నించారు. అందుకే మమతా బెనర్జీ ఆ పత్రాలను రక్షించేందుకు అక్కడికి వెళ్లారని వాదించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, నోటీసులు జారీ చేయకుండా ఆపలేరని స్పష్టం చేసింది. ఎన్నికల డేటా స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఉంటే ఈడీ అప్పుడే చేసేదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ తరఫున హాజరైన అభిషేక్ సింఘ్వీ.. ఈడీ ఒకే కేసును హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఒకేసారి ప్రస్తావించడం సరికాదని అన్నారు. జనవరి 9న గందరగోళం జరిగిందని ఒప్పుకుంటూనే, భావోద్వేగాల వల్ల కొన్నిసార్లు ఇలా జరుగుతుందని వ్యాఖ్యానించారు. దీనికి కోర్టు స్పందిస్తూ, భావోద్వేగాలు మళ్లీ మళ్లీ అదుపు తప్పకూడదని హెచ్చరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Calcutta High Court chaos
  • ED I-PAC case
  • I-PAC raids news
  • Kapil Sibal Mamata Banerjee
  • Mamata Banerjee ED probe

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions