SC: సీఎంని చంపిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదిస్తారా? 2 వారాల్లో చెప్పండి.. రాష్ట్రపతికి సుప్రీం విజ్ఞప్తి
- 1995 లో సీఎం బియాంత్సింగ్ హత్య
- హత్య కేసులో ప్రధాన నిందితుడు బల్వంత్సింగ్ రాజోనా
- ఈ కేసులో రాజోనాకు మరణశిక్ష
- క్షమాభిక్ష పిటిషన్ను పరిష్కరించడంలో జాప్యం
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేరస్థుడు
- రెండు వారాల్లో క్షమాభిక్ష పిటిషన్ను పరిశీలించాలని సుప్రీం విజ్ఞప్తి
బల్వంత్సింగ్ రాజోనా క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ముందు సమర్పించాలని రాష్ట్రపతి కార్యదర్శి సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో క్షమాభిక్ష పిటిషన్ను పరిశీలించాలని రాష్ట్రపతిని సుప్రీంకోర్టు కోరింది. అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో రాజోనాకు మరణశిక్ష విధించబడింది. దీంతో నిందితుడు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ను దాఖలు చేశాడు. క్షమాభిక్ష పిటిషన్ను పరిష్కరించడంలో జాప్యం కారణంగా.. శిక్షను తగ్గించి, విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాజోనా సుప్రీంకోర్టులో దరఖాస్తు చేశారు. నిర్ణీత గడువులోగా క్షమాభిక్ష పిటిషన్ను పరిశీలించకపోతే ఉపశమనం కోసం పిటిషనర్ అభ్యర్థనను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను డిసెంబరు 3వ తేదీకి వాయిదా వేసింది.
ముఖ్యమంత్రి బియాంత్సింగ్ ఎలా చనిపోయాడు?
పంజాబ్ సచివాలయం.. ఉదయం 12 గంటలు.. కారులో కూర్చున్న ముఖ్యమంత్రి బియాంత్సింగ్.. ఎవరితోనే మాట్లాడుతున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మానవ బాంబు తనను తాను పేల్చుకున్నాడు. ఈ సంఘటనలో సీఎం బియాంత్ సింగ్ అక్కడికక్కడే విగతజీవిగా మారగా.. మొత్తం 16 మంది కూడా చనిపోయారు. ఈ హత్యాకాండకు పాల్పడిన ఇద్దరికి ఉరిశిక్ష, మరో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్ష తీర్పును కోర్టు ప్రకటించింది. ఈ ఘటన సరిగ్గా ఇదే రోజున 1995 లో జరిగింది. భారతదేశానికి స్వాంతంత్య్రం వచ్చినప్పటి నుంచి పంజాబ్లో అల్లర్లు, ఆందోళనలు సర్వసాధారణంగా మారాయి. ఎప్పుడు ఏదో ఒక చోట హింస జరిగేది. ఆందోళనలకు పుల్స్టాప్ పెట్టేందుకు కేంద్రం చాలా సార్లు అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. 1987 లో కూడా కేంద్రం రాష్ట్రపతి పాలనకు ఆదేశించింది. నాలుగేండ్ల తర్వాత అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరుపగా, కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
నిందితులకు పంజాబ్ కోర్టులో ఉరిశిక్ష..
ముఖ్యమంత్రిగా బియాంత్ సింగ్ నియమితులయ్యారు. వేర్పాటువాదంతో హింసకు పాల్పడుతున్న ఖలిస్తానీ తీవ్రవాదుల సమస్య బియాంత్ సింగ్ ముందు పెద్ద సవాల్గా నిలిచింది. సచివాలయం వద్ద కారులో కూర్చుండి అధికారులతో మాట్లాడుతుండగా బెల్ట్ బాంబు రూపంలో మృత్యువు ఎదురుగా వచ్చింది. భద్రతా అధికారులు పక్కకు తప్పించేంతలో ఒక్కసారిగా విస్ఫోటనం జరిగి.. బియాంత్సింగ్తో పాటు ఎందరో ముక్కలుముక్కలుగా మారిపోయారు. ఈ దాడికి ప్రధాన కారకులైన జగతార సింగ్, బల్వంత్ సింగ్ రాజోనాలకు పంజాబ్ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. అయితే, తర్వాత జగతార సింగ్ హైకోర్టును ఆశ్రయించగా.. జగతారకు కింది కోర్టు విధించిన శిక్షను జీవిత ఖైదుగా పంజాబ్ హైకోర్టు మారుస్తూ తీర్పునిచ్చింది. కానీ, బల్వంత్ సింగ్ శిక్షను హైకోర్టు సమర్థించింది. కాగా, 2019 లో గురుపూరబ్ సందర్భంగా బల్వంత్సింగ్ శిక్షను జీవిత ఖైదుగా కేంద్ర హోం శాఖ మార్చింది.
తాజావార్తలు
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!