SC: సీఎంని చంపిన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదిస్తారా? 2 వారాల్లో చెప్పండి.. రాష్ట్రపతికి సుప్రీం విజ్ఞప్తి
- 1995 లో సీఎం బియాంత్సింగ్ హత్య
- హత్య కేసులో ప్రధాన నిందితుడు బల్వంత్సింగ్ రాజోనా
- ఈ కేసులో రాజోనాకు మరణశిక్ష
- క్షమాభిక్ష పిటిషన్ను పరిష్కరించడంలో జాప్యం
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేరస్థుడు
- రెండు వారాల్లో క్షమాభిక్ష పిటిషన్ను పరిశీలించాలని సుప్రీం విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బల్వంత్సింగ్ రాజోనా క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ముందు సమర్పించాలని రాష్ట్రపతి కార్యదర్శి సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో క్షమాభిక్ష పిటిషన్ను పరిశీలించాలని రాష్ట్రపతిని సుప్రీంకోర్టు కోరింది. అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో రాజోనాకు మరణశిక్ష విధించబడింది. దీంతో నిందితుడు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ను దాఖలు చేశాడు. క్షమాభిక్ష పిటిషన్ను పరిష్కరించడంలో జాప్యం కారణంగా.. శిక్షను తగ్గించి, విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాజోనా సుప్రీంకోర్టులో దరఖాస్తు చేశారు. నిర్ణీత గడువులోగా క్షమాభిక్ష పిటిషన్ను పరిశీలించకపోతే ఉపశమనం కోసం పిటిషనర్ అభ్యర్థనను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను డిసెంబరు 3వ తేదీకి వాయిదా వేసింది.
ముఖ్యమంత్రి బియాంత్సింగ్ ఎలా చనిపోయాడు?
పంజాబ్ సచివాలయం.. ఉదయం 12 గంటలు.. కారులో కూర్చున్న ముఖ్యమంత్రి బియాంత్సింగ్.. ఎవరితోనే మాట్లాడుతున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మానవ బాంబు తనను తాను పేల్చుకున్నాడు. ఈ సంఘటనలో సీఎం బియాంత్ సింగ్ అక్కడికక్కడే విగతజీవిగా మారగా.. మొత్తం 16 మంది కూడా చనిపోయారు. ఈ హత్యాకాండకు పాల్పడిన ఇద్దరికి ఉరిశిక్ష, మరో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్ష తీర్పును కోర్టు ప్రకటించింది. ఈ ఘటన సరిగ్గా ఇదే రోజున 1995 లో జరిగింది. భారతదేశానికి స్వాంతంత్య్రం వచ్చినప్పటి నుంచి పంజాబ్లో అల్లర్లు, ఆందోళనలు సర్వసాధారణంగా మారాయి. ఎప్పుడు ఏదో ఒక చోట హింస జరిగేది. ఆందోళనలకు పుల్స్టాప్ పెట్టేందుకు కేంద్రం చాలా సార్లు అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. 1987 లో కూడా కేంద్రం రాష్ట్రపతి పాలనకు ఆదేశించింది. నాలుగేండ్ల తర్వాత అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరుపగా, కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Also Read
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
నిందితులకు పంజాబ్ కోర్టులో ఉరిశిక్ష..
ముఖ్యమంత్రిగా బియాంత్ సింగ్ నియమితులయ్యారు. వేర్పాటువాదంతో హింసకు పాల్పడుతున్న ఖలిస్తానీ తీవ్రవాదుల సమస్య బియాంత్ సింగ్ ముందు పెద్ద సవాల్గా నిలిచింది. సచివాలయం వద్ద కారులో కూర్చుండి అధికారులతో మాట్లాడుతుండగా బెల్ట్ బాంబు రూపంలో మృత్యువు ఎదురుగా వచ్చింది. భద్రతా అధికారులు పక్కకు తప్పించేంతలో ఒక్కసారిగా విస్ఫోటనం జరిగి.. బియాంత్సింగ్తో పాటు ఎందరో ముక్కలుముక్కలుగా మారిపోయారు. ఈ దాడికి ప్రధాన కారకులైన జగతార సింగ్, బల్వంత్ సింగ్ రాజోనాలకు పంజాబ్ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. అయితే, తర్వాత జగతార సింగ్ హైకోర్టును ఆశ్రయించగా.. జగతారకు కింది కోర్టు విధించిన శిక్షను జీవిత ఖైదుగా పంజాబ్ హైకోర్టు మారుస్తూ తీర్పునిచ్చింది. కానీ, బల్వంత్ సింగ్ శిక్షను హైకోర్టు సమర్థించింది. కాగా, 2019 లో గురుపూరబ్ సందర్భంగా బల్వంత్సింగ్ శిక్షను జీవిత ఖైదుగా కేంద్ర హోం శాఖ మార్చింది.
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!