Team India: భారత క్రికెట్ పరిస్థితి ఎప్పుడూ ఇలా లేదు.. గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు!
- టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్పై విమర్శలు
- కుల్దీప్ యాదవ్ను ఆడించకపోవడంపై చర్చనీయాంశం
- కెప్టెన్దే జట్టు విషయంలో తుది నిర్ణయం అంటున్న సన్నీ
- ఆ కాలంలో కోచ్లు లేరంటున్న గవాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar Slams Team India Management: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించినప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయి. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లేదా కెప్టెన్ శుభ్మన్ గిల్లో ఎవరు తుది జట్టుపై నిర్ణయాలు తీసుకుంటున్నారు? అని అభిమానుల మెదడును తొలిచేస్తోంది. గిల్ ధైర్యంగా తన అభిప్రాయాలను కోచ్ ముందు వెల్లడిస్తున్నాడా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై మాజీ లెజెండరీ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శార్దూల్ ఠాకూర్కు బదులు కుల్దీప్ను ఆడించడానికే గిల్ మొగ్గి చూపించాడని, కోచ్ అతడి నిర్ణయాన్ని పట్టించుకోలేదని పరోక్షంగా చెప్పారు.
సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘తుది జట్టు విషయంలో కెప్టెన్ కీలక పాత్ర పోషించాలి. కెప్టెన్దే జట్టు విషయంలో తుది నిర్ణయం. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ విషయంలో చర్చ జరిగుండొచ్చు. శుభ్మాన్ గిల్ బహుశా శార్దూల్ను తుది జట్టులోకి తీసుకోవాలనుకోలేదు. కుల్దీప్ను అవకాశం ఇవ్వాలనుకున్నాడు. గిల్ కెప్టెన్ కాబట్టి అతడే తుది నిర్ణయం తీసుకోవాలి. జట్టులో ఎవరు ఉండాలి?, ఉండకూడదు? అనేది కెప్టెన్దే నిర్ణయం. ఎందుకంటే ఏం జరిగినా కెప్టెన్దే పూర్తి బాధ్యత. సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ను మార్చాడు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరెవరైనా అయినా సరే.. వారి స్వంత ఉనికి, స్టయిల్ ఉంటుంది’ అని తెలిపారు.
Also Read
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
- Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
Also Read: Team India: అరంగేట్రం కోసం ఏళ్లుగా ఎదురుచూపులు.. అతడి తర్వాత వచ్చిన 16 మంది కెరీర్ను ప్రారంభించారు!
‘ఆ కాలంలో కోచ్లు లేరు. కేవలం మాజీ ఆటగాళ్లు జట్టుకు మేనేజర్లుగా, అసిస్టెంట్ మేనేజర్లుగా ఉండేవారు. వారి వద్దకు వెళ్లి నేరుగా మాట్లాడొచ్చు. లంచ్, రోజు ముగిసిన తర్వాత సలహాలు ఇస్తుంటారు. ఇప్పుడు పూర్తిగా మారింది. భారత క్రికెట్ పరిస్థితి గతంలో ఎప్పుడూ ఇలా లేదు. బీసీసీఐ నుంచి గౌతమ్ గంభీర్ తనకు కావాల్సినవి అన్ని తీసుకున్నాడు. కేకేఆర్ స్టాఫ్ మొత్తాన్ని టీమిండియాలోకి తెచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంలో గౌతీ పాత్ర ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కెప్టెన్ కంటే తనకే ఎక్కువ పవర్ ఉండాలని గంభీర్ అనుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శనకు గౌతీదే మొత్తం క్రెడిట్’ అని సన్నీ చెప్పుకొచ్చారు. తుది జట్టు విషయంలో గంభీర్ కలగజేసుకుంటున్నాడని సన్నీ ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!